మహేశ్వరం: పహాణీని ఆన్లైన్ చేసేం దుకు రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఓ అసిస్టెంట్ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 3 వేలు తీసుకొని రెడ్ హ్యాండెడ్గా అధికారుల వలకు చిక్కాడు. ఈ సంఘటన మహేశ్వరం మండలంలోని గొల్లూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామానికి చెందిన దార లక్ష్మీనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగి స్తున్నాడు. ఆయనకు గ్రామ పరిధిలో సర్వేనంబర్ 21ఆ,ఇ లో 37 గుంటల భూమి ఉంది. సదరు భూమికి సంబంధించిన పహాణీని ఆన్లైన్ చేసేందుకు ఆయన ఆరు నెలలుగా అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్ చుట్టూ తిరుగుతున్నాడు.
పని జరగాలంటే రూ. 5 వేలు ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ వీఆర్వో రైతుకు స్పష్టం చేశాడు. చేసేది లేక రైతు లక్ష్మీనారాయణ గతంలో రూ. 2 వేలు ఇచ్చాడు. మిగతా రూ.3 వేలు ఇస్తేనే పని అవుతుందని అసిస్టెంట్ వీఆర్వో చెప్పాడు. డబ్బుల విషయమై ఆయన నిత్యం రైతుకు ఫోన్ చేసి వేధించసాగాడు. నిరుపేద అయిన రైతుకు డబ్బు ఇచ్చే తాహతు లేదు. దీంతో డబ్బుల కోసం వేధిస్తున్న అసిస్టెంట్ వీఆర్వోను ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టించాలని పథకం పన్నాడు. ఈవిషయమై లక్ష్మీనారాయణ రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించి వివరాలు చెప్పాడు. అధికారుల సూచన మేరకు రైతు బుధవారం ఉదయం 8 గంటలకు గొల్లూరులోని అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్ ఇంటికి వెళ్లి రూ. 3 వేలు ఇచ్చాడు.
అధికారి డబ్బులు తీసుకొని కారులో వెళ్తుండగా ఏసీబీ అధికారులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అతడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని గ్రామంలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ వీఆర్వోను అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు సేకరించారు.
భయంభయం..
గొల్లూరు గ్రామంలో అసిస్టెంట్ వీర్వో పాపయ్యగౌడ్ ఏసీబీకి పట్టుబడడంతో మండలంలోని అన్నిశాఖల అధికారుల కు గుబులు పట్టుకుంది. రోజంతా భయంభయంగా గడిపారు.
పాపయ్యగౌడ్పై పలు అవినీతి ఆరోపణలు
అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై చేయి చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెవె న్యూ రికార్డులు, పహాణీల కోసం రైతులు వెళ్తే డబ్బులు తీసుకోనిదే పనిచేసేవాడు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో సీఐలు ఆర్. నిరంజన్, సుదర్శన్రెడ్డి, సీఐ యేసుదాసు, వైవీఎల్. నాయిడు, అంజిరెడ్డి ఉన్నారు.
నిత్యం వేధించేవాడు
'పహాణీ పత్రాన్ని ఆన్లైన్ చేసేందుకు అసిస్టెంట్ వీఆర్వో రూ. 5 వేలు డిమాండ్ చేశాడు. గతంలో రెండు వేలు ఇచ్చాను. మిగతా డబ్బులు ఇవ్వాలని రోజూ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఆయన వేధింపులు తట్టుకోలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. మండలంలోని ఇంకా చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వారిని కూడా ఏసీబీకి పట్టిస్తాను.’
-లక్ష్మీనారాయణ, రైతు
ఏసీబీ వలకు చిక్కిన అసిస్టెంట్ వీఆర్వో
Published Thu, Dec 4 2014 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement