చెన్నూర్ : నిన్న మొన్నటి వరకు మండల కేంద్రాల్లో రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు ఉంటే మళ్లీ శనివారం నుంచి 6 గంటల విద్యుత్ కోతలు ఉంటాయని ట్రాన్స్ కో అధికారులు ప్రకటించారు. దీంతో వర్షాకాలంలో కూడా ప్రజలకు విద్యుత్ వెతలు తప్పడంలేదు. దీంతో ఇటు చిన్న వ్యాపారులు, అటు రైతులు, మరోవైపు గృహ వినియోగదారులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
వ్యాపారాలపై పిడుగు
ఇదివరకు మండల కేంద్రాల్లో ఉదయం 6 నుం చి 8 వరకు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు కరెంటు కోతలు విధించారు. ఈ సమయాల్లో కోత విధించడంతో చిన్న వ్యాపారులకు కొంత వెసులుబాటు లభించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్, పిండి గిర్ని, టైర్ పంక్చర్ టైలరింగ్, కార్పెంటర్లు, సర్వీసింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. షాపులు తెరిచే సమయంలో కరెంటు కోతలు ఉంటే తాము పనులు ఎలా చేసుకునేదని వ్యాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరని నష్టం
కరెంటు కోతలు ప్రారంభం నుంచి ప్రజలు, రై తులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కరెంటు ఉంటే రూ.300ల నుంచి రూ. 400ల వరకు గిట్టుబాటు అయ్యేది. రెండు నెలల ట్రాన్స్కో విధిస్తున్న కరెంటు కోత ల మూలంగా రోజుకు రూ.200 గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మ ళ్లీ మరో రెండు గంటలు పెంచితే షాపుల అద్దె లు కట్టేందుకు కూడా తమ సంపాదన సరిపోదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడలేదని ఇష్ట్యారాజ్యంగా కరెంటు సరఫరా నిలిపివేయడంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మళ్లీ పెరిగిన విద్యుత్ కోతలు
Published Tue, Jul 8 2014 12:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement