నేడు పాలీసెట్‌  | Sakshi
Sakshi News home page

నేడు పాలీసెట్‌ 

Published Sat, Apr 21 2018 1:16 AM

All Arrangements Done For Polycet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించనున్న పాలీసెట్‌–2018 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలీసెట్‌ చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుం దని పేర్కొన్నారు. విద్యార్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవా లని నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించిన వివరాలకు 18005995577 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. పాలీసెట్‌కు 1,25,063 మంది దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 76,298, బాలికలు 48,765 మంది ఉన్నట్లు వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement