ఆల్ ద బెస్ట్ | Sakshi
Sakshi News home page

ఆల్ ద బెస్ట్

Published Thu, Mar 27 2014 12:28 AM

ఆల్ ద బెస్ట్ - Sakshi

  •     నేటి నుంచే టెన్త్ పరీక్షలు
  •      జంట జిల్లాల నుంచి 1.85 లక్షల మంది
  •  సాక్షి, సిటీబ్యూరో : మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జంట జిల్లాల నుంచి మొత్తం 1,85,390 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 15 వరకు కొనసాగనున్న పరీక్షల నిమిత్తం 813 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలుండే మార్గాల్లో ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement