కరీంనగర్: తన కొడుక్కు ఉద్యోగం కోసం ఓ టీఆర్ఎస్ నాయకుడి చుట్టూ తిరిగాడు.. అడిగినంత డబ్బు కూడా ముట్టజెప్పాడు.. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో చివరకు మోసపోయానని తెలుసుకున్నాడు.. దీంతో అతను గుండెపోటుతో మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్లో చోటుచేసుకుంది. వన్నారంనకు చెందిన కొప్పుల సత్యనారాయణ కొడుకు బీఎస్సీ(అగ్రికల్చరల్) చదివి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. దాంతో అతనికి ఉద్యోగం వేయించాలని టీఆర్ఎస్ నాయకుడు జూపాక సుదర్శన్ చుట్టూ తిరిగాడు. అతడు రూ.5 లక్షలు అడిగాడు.
నాలుగు లక్షలు ఇచ్చినా ఎంతకూ ఉద్యోగం వేయించకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నాడు. మనోవేదన చెందిన అతను చివరకు గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. కాగా, సత్యనారాయణ మృతికి కారణమంటూ సుదర్శన్ ఇంటిముందు శవంతో మృతుని కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.
టీఆర్ఎస్ నేత ఘరానా మోసం
Published Mon, May 29 2017 11:34 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
Advertisement