సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పాలనను సాగించారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాతకు నేతలు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. అట్టడుగు వర్గాలు, దళితుల అభివృద్ధి, వారి సంక్షేమాన్ని అంబేడ్కర్ నిరంతరం కాంక్షించారని, చివరి వరకూ అందుకోసమే తపించారని పొంగులేటి కొనియాడారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళిత, బలహీన వర్గాలకు ఎక్కువ మేలును చేకూర్చే సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా వైఎస్ చేశారని పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వైఎస్ మాదిరిగానే సంక్షేమ పాలనను అందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచం గర్వించదగిన వ్యక్తి అంబేడ్కర్ అని, ఆయన ఒక్క దళితులకే నాయకుడు కాదని, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి అని కొనియాడారు.
అంటరానితనంపై అలుపెరుగని పోరాటం
వందేళ్ల క్రితమే అంటరానితనం, దురాచారాలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ అలుపెరుగని పోరాటం చేశారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున శ్లాఘించారు. ఆయన కాంక్షించిన బడుగు వర్గాల సంక్షేమాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ ఆలోచన లు అంబేడ్కర్ ఆశయాలకు అద్దం పట్టేవిగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తారని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. ప్రజలందరి సంక్షేమానికి పాటుపడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి వైఎస్ కట్టుబడి పాలన సాగిస్తే ఇప్పటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పౌరహక్కులను కాలరాస్తూ అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో స్మగ్లర్లనే పేరుతో 20 మంది దళిత కూలీలను కాల్చిచంపడం, తెలంగాణలో వికారుద్దీన్ బృందాన్ని హతం చేయడం పౌరహక్కులను హరించడమేనన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, నేతలు కొండా రాఘవరెడ్డి, వాసిరెడ్డి పద్మ, చల్లా మధుసూదన్రెడ్డి, డా. ప్రపుల్ల రెడ్డి, వెల్లాల రామ్మోహన్, కర్నాటి ప్రభాకర్రెడ్డి, కె.వెంకటరెడ్డి, దుద్దుకూరు శ్రీధర్ రెడ్డి, ఎం. జయరాజ్, నాగదేశి రవికుమార్, బండారు సుధాకర్, జార్జిహెర్భట్, ఎం.సందీప్కుమార్, వనజ, శ్యామల, క్రిస్టోలైట్ అంబేడ్కర్కు శ్రద్ధాంజలి ఘటించారు.
అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్ పాలన: వైఎస్సార్సీపీ
Published Wed, Apr 15 2015 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement