22న నగరానికి అమిత్‌షా | Sakshi
Sakshi News home page

22న నగరానికి అమిత్‌షా

Published Tue, Jun 12 2018 1:48 AM

Amit Shah to the city on 22 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా 22న హైదరాబాద్‌ రానున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పర్యటన ఉంటుందని ఇదివరకే ఆ పార్టీ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఒక్కరోజే తెలంగాణకు కేటాయించారు. గత ఎన్నికల్లో పార్టీ గెలవని 120 స్థానాలపై దృష్టిపెట్టిన కమలదళం ఆయా నియోజకవర్గాల తీరుతెన్నులపై ఓ అంచనాకొచ్చింది. ఈ నియోజకవర్గాలే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే అమిత్‌ షా పర్యటన ప్రారంభించారు. ఇందులో భాగంగా 22న రాష్ట్ర నేతలతో భేటీ నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement