శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన ఖ్యాతిని దిగజార్చి.. అవమానపర్చడమేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తే అందుకు సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాజీవ్గాంధీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ఉన్న నాలుగు ఎయిర్పోర్టులతో పాటు నిర్మాణం చేయదల్చుకున్న వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని సూచించారు. చేసిన వాగ్దానాలను నేరవేర్చలేని స్థితిలో ఉన్న బాబు ఆంధ్రాలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశీయ టెర్మినల్కు పెట్టిన ఎన్టీఆర్ పేరును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు మార్పుపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు.
అసెంబ్లీలో తీర్మానం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. పేరుమార్పుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటు చేసిన ఘనత యూపీఏదేనని చెప్పారు. పేర్లు మార్చే సంస్కృతి మంచిది కాదని సబిత హితవుపలికారు. ప్రస్తుతం చేసే ధ ర్నా కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్టీఆర్ పేరును తొలగించే వరకు ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రసంగాల అనంతరం సర్వే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు జాతీయరహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ తర లించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, కాంగ్రెస్ యువనేత కార్తీక్రెడ్డి , జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎన్టీఆర్ను అవమానపర్చేందుకే పేరుమార్పు
Published Mon, Nov 24 2014 11:40 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement