ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
♦ అప్పుల బాధతో.. ఏడుగురు రైతుల బలవన్మరణం
♦ గుండె ఆగి మరో ఇద్దరు రైతుల మృతి.. పల్లెల్లో విషాదం
సాక్షి, నెట్వర్క్ : తెలంగాణ జిల్లాల్లో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఒక్క రోజే వివిధ జిల్లాల్లో మొత్తం ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లికి చెందిన నల్ల కిష్టయ్య (40) వ్యవసాయం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీరే మార్గం కనబడక బుధవారం తెల్లవారుజామున చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామానికి చెందిన వెంకటనర్సయ్య(63) వ్యవసాయానికి చేసిన అప్పులు రూ. 4 లక్షలు పేరుకుపోయూరుు.
అప్పు ఎలా తీర్చాలని మధనపడుతూ మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందుతాగి మృతిచెందాడు. మెదక్ జిల్లా ములుగు మండలం అన్నాసాగర్కు చెందిన రైతు గూడూరి మల్లారెడ్డి (42) వరి, మొక్కజొన్న సాగు కోసం సుమారు రూ.ఐదు లక్షల వరకు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చే మార్గం కన్పించక తీవ్ర మనస్తాపానికి గురైన మల్లారెడ్డి.. మంగళవారం రాత్రి ఔటర్రింగ్రోడ్డు వద్ద పురుగుల మందు తాగాడు. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మునగాల రైతు తేజావత్ మంగ్యా(36) గత ఏడాది తనకున్న ఎకరం పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగుచేశాడు.
పంట సక్రమంగా పండక, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో గత ఏడాది రూ.1.50 లక్షలకుపైగా అప్పులయ్యాయి. ఈ ఏడాది అప్పులు పుట్టడంలేదని మనస్తాపానికి గురైన మంగ్యా ఇంటికివచ్చి క్రిమిసంహారక మందు తాగాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాలకు చెందిన అంబటి నారాయణ(45) వ్యవసాయం కోసం రూ.4 లక్షల అప్పు చేశాడు. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి చనిపోయూడు.
తిమ్మాపూర్ మండ లం పొరండ్ల గ్రామానికి చెందిన ముస్కు నాగిరెడ్డి(47) వ్యవసాయ పెట్టుబడుల కోసం రూ.3 లక్షల దాకా అప్పు చేశాడు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన నాగిరెడ్డి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఇంటికి సమీపంలోని పత్తి చేనులో క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. కోరుట్ల పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన మామిడిపల్లి రాములు(58) పంటల సాగుకు, కొడుకు వైద్యఖర్చుల కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలకు చేరాయి. దీంతో మనస్తాపం చెంది బుధవారం తన వ్యవసాయ భూమి సమీపంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడు.
గుండె ఆగి మరో ఇద్దరు...
రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన మాడిశెట్టి జలపతి అనే రైతు బుధవారం పొలానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేయడానికి వెళ్లి అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఆదిరాల సైదులు(31) ఇంటి అవసరాలు, పెట్టుబడుల కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిడితో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు.
పంట పొలాల్లో మరణ మృదంగం
Published Thu, Sep 3 2015 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement