మరో 143 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

మరో 143 కరోనా కేసులు

Published Sat, Jun 6 2020 3:59 AM

Another 143 Corona Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,290కి పెరిగింది. కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 113కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 116 నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్‌లో 5, వరంగల్‌లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో 2 చొప్పున, మంచిర్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటివరకు 1,627 మంది డిశ్చార్జి కాగా, 1,550 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement