ఎక్సైజ్ స్టేషన్ ఎదుట తండావాసుల ఆందోళన
అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు తొలగింపు, విడుదల
తప్పుడు కేసు బనాయించిన అధికారులపై చర్యలు శూన్యం
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ మండలం కా ల్పోల్ తండాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై నమోదు చేసిన కేసు మరో మలుపు తిరిగింది. ఎక్సై జ్ అధికారులు అమాయకుడైన వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకోవటంతో శనివారం తండాకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చివరికి గ్రామస్తులు ద్వారా నిజాలు తెలుసుకున్న అధికారు లు తమ ఆధీనంలో ఉన్న వ్యక్తిని వదిలిపెట్టారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు..
తండాలో కొంతమంది గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అరుణ్రావు ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో తండాలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రతిరాం అనే వ్యక్తిని పట్టుకుని విచారణ పేరుతో నిజామాబాద్కు తరలించారు. దీంతో శనివారం ఉదయం తండావాసులు ఎక్సైజ్ స్టేషన్కు చేరుకుని పశువులు కాసే వ్యక్తికి వ్యవసాయ భూమి లేదని, అటువంటప్పుడు అతను ఎలా గంజాయి సాగుచేస్తాడని అధికారులను ప్రశ్నించారు. అడవిలో పెరిగిన గంజాయి మొక్కలను పీకి వాటిని రతిరాం ఇంటిముందు వేసి అతనే గంజాయి సాగుచేస్తున్నాడని అరెస్టు చేయడం తగదన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేసే మోహన్సింగ్ కాల్పోల్ తండాకు చెందిన వాడని, తామంటే అతనికి గిట్టని ఆయన అక్రమం గా రతిరాంను కేసులో ఇరికించాడని ఆరోపించారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ లక్ష్మణ్నాయక్, సీఐ సాదిక్లు రతిరాంపై అక్రమంగా కేసులు బనాయించారని నిరసనకు దిగారు. తండావాసులు పె ద్ద ఎత్తున తరలిరావటంతో ఎక్సైజ్ సూపరింటెం డెంట్ గంగారాం ఎక్సైజ్ స్టేషన్కు చేరుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్ సీఐ కిష్టయ్య, నగర సీఐ నర్సింగ్యాదవ్, 3,4 టౌన్ల ఎస్సైలు శ్రీహరి, నరేష్, స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు చేపట్టారు. ఈఎస్ గంగారాం శుక్రవారం కాల్పోల్ తండాకు వెళ్లిన అధికారులను పిలిపించి పోలీసులు, తండావాసుల సమక్షంలో జరిగిన విషయం ఏమిటో తెలుసుకున్నారు.
అదుపులో ఉన్న రతిరాంకు ఎలాంటి భూములు లేవని గ్రామస్తులు చెప్పడంతో ఆయనను అధికారులు వదిలిపెట్టారు. సాగులో ఉన్న గంజాయి మొక్కలు ఎవరికి చెందినదో గుర్తించేందుకు గ్రామానికి చెందిన వీఆర్ఏను రప్పించారు. ఆయన వద్ద ఉన్న రికార్డుల ప్రకారం అటవీ శాఖకు చెందిన భూమి బన్సీరాంసింగ్ సాగు చేస్తున్నాడని తేలింది. ఆయనపై కేసు నమోదు చేసినట్లు కేసు విచారణ చేపట్టిన నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ కిష్టయ్య తెలిపారు. అలాగే తండాలో రతావత్ బిక్యా ఇంటిముందు 15 గంజాయి మొక్కలు, బన్సీ సరుతిరాం ఇంటిముందు పెంచుతున్న 25 మొక్కలను పట్టుకుని వాటిని పెంచుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలించి అరెస్టు చేస్తామన్నారు.
మరో మలుపు తిరిగిన గంజాయి కేసు
Published Sun, Nov 16 2014 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement