⇒ కష్టజీవుల పక్షాన నిలిచిన కానూరి తాత
⇒ సంస్మరణ సభలో సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి
ఖమ్మం మయూరిసెంటర్ : కేంద్రంలో, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా కళాకారులు వ్యవహరించాలని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. బుధవారం ఖమ్మంలోని పోట్ల రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆవుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు సంస్మరణ సభను నిర్వహించారు.
హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో కానూరి తాత వీరమరణం పొందారన్నారు. ఆయన 99 సంవత్సరాల కాలంలో ప్రజా సాంస్కృతిక కేంద్రాలకు జీవితాన్ని త్యాగంచేశారని అన్నారు. సినిమా జీవితం వందేళ్లయితే 75 ఏళ్లు సాంస్కృతిక రంగానికి సేవ చేశారన్నారు. ఏఎన్ఆర్, మిక్కిలినేని లాంటి ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఆయన తుది శ్వాస వరకు ఎర్రజెండా నీడన పనిచేశారని, ఆయన కృష్ణా జిల్లాలోని ఒక దేవాలయంలో భజన పాటలు, కీర్తనల స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలు పాడి ప్రజలను ఉత్తేజ పరిచారని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే ఇన్ని సంవత్సరాల పాటు కళారంగానికి సేవ చేసిన అరుదైన వ్యక్తి కానూరి తాత అని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మన దేశానికి వస్తున్న సమయంలో కూడా ఆయన రాకకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కానూరి తాత పాల్గొన్నారని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. పేదలు ఎప్పుడైతే ప్రజా ప్రతినిధులు అవుతారో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటున్న రాహుల్ గాంధీ వారి ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. చాయ్వాలా అని చెప్పుకునే ప్రధాని మోదీ విదేశీ పెట్టుబడి దారులకు రెడ్కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. దీంతో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, కృష్ణ మాట్లాడారు. తొలుత కానూరి చిత్రపటానికి ఆర్. నారాయణమూర్తి.
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, రామారావు, కృష్ణ, నాయకులు సివై. పుల్లయ్య, బి. వెంకన్న పూల మాల వేసి నివాళి అర్పించారు. విప్లవోద్యమ సాంస్కృతిక నేత అని అరుణోదయ కళాకారులు పాట లు పా డారు. అనంతరం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రచురించిన ప్రజా సాంస్కృతిక ఉద్యమకేతనం అనే పుస్తకాన్ని నారాయణ మూర్తి ఆవిష్కరించారు.
కళాకారులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి
Published Thu, Apr 23 2015 2:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement