ప్రగతినగర్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది దళిత సమాజంపై జరిగిన దాడి అని దళిత సంఘాల చర్చా వేదిక నాయకులు అన్నారు. ఇదంతా తెలిసి కూడా కలెక్టర్, జేసీ మౌనం దాల్చడం సరికాదన్నారు. నిజామాబాద్ టీఎన్జీవోస్ కార్యాలయంలో గురువారం ఎమ్మార్పీఎస్, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. మందకృష్ణపై ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.
వారంతా దళితులు కాదని, ఎమ్మెల్యే దగ్గర పనిచేసే గుండాలని ఆరోపించారు. దళితుల కోసం పోరాడేది వామపక్ష పార్టీలేనని తెలిపారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీలు కార్మికుల, దళితుల పార్టీల ని మరోసారి రుజువయిందన్నారు. ఎమ్మెల్యే రవీందర్రెడ్డి దళితుల భూములు లాక్కోవడమే కాక, వారిపై వివిధ కేసులు బనాయించడం, దాడులు చేయడం అధికార దురహంకారమేనని విమర్శించారు. న్యాయం కోసం దళితులు తహశీల్దార్, ఆర్డీవో, పోలీస్స్టేషన్ల చుట్టు తిరిగినా.. వారు అధికార పార్టీ తొత్తులుగా మారి ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని, ఈ విషయంలో కలెక్టర్, జేసీ స్పందించాలని కోరారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని దళితుల సమస్యలను స్వయంగా మందకృష్ణ జే సీకి విన్నవించినా.. ఆ సమస్య తమ దృష్టికి రాలేదని కలెక్టర్, జారుుంట్ కలెక్టర్ చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్ దళితుల సంక్షేమమంటూనే మరోవైపు ఆ వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయ న బాటలోనే నడుస్తున్నారనడానికి ఎల్లారెడ్డి ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. దళితులంతా కలిసి ఐక్యంగా పోరాడి ఎమ్మెల్యే ఆగడాలను ఎండగడతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇత ర నాయకులతో కలిసి ఈనెల 6న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రకటించారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగభూష ణం, రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రబాకర్, దేవారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్, నాయకులు గోవర్దన్, వెంకట్గౌడ్,సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న పాల్గొన్నారు.
5న కామారెడ్డి బంద్..
ఎమ్మెల్యే రవీందర్రెడ్డి వైఖరికి నిరసనగా ఈ నెల 5న కామరెడ్డి బంద్కు పిలుపునిస్తున్నట్లు న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రభాకర్ తెలిపారు.
మందకృష్ణపై దాడి హేయనీయం
Published Fri, Jul 3 2015 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement