- రాష్ట్రావతరణ ఉత్సవాల్లో భాగంగా 50 మందికి సత్కారం
హైదరాబాద్: వచ్చే నెల తొలివారంలో నిర్వహించే రాష్ట్రావతరణ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వ్యవసాయం, విద్య, ప్రభుత్వ ఉద్యోగం, సామాజిక సేవ, వైద్యం, క్రీడలు వంటి ముఖ్య రంగాలకు చెందిన 50 మందిని ఎంపిక చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అధ్యక్షుడుగా ఉండే ఈ కమిటీలో సాంస్కృతిక సలహాదారు,
తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ రంగాల్లో ప్రముఖులైన చుక్కా రామయ్య, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, పద్మజారెడ్డి, బి.నరసింగరావు, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సభ్యులుగా ఉంటారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఉత్తమ రైతు, ఉత్తమ ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు, ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి, ఉత్తమ సామాజిక సేవకుడు, ఉత్తమ వైద్యుడు, ఉత్తమ ఎన్జీవో, ఉత్తమ క్రీడాకారుడు/క్రీడాకారిణి, ఉత్తమ సాహితీవేత్త(తెలుగు-ఉర్దూ), ఉత్తమ వేద పండితుడు, ఉత్తమ అర్చకుడు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ మండలం, ఉత్తమ మునిసిపాలిటీ, ఉత్తమ గ్రామపంచాయతీ, ఉత్తమ న్యాయకోవిదుడు, ఉత్తమ సైంటిస్ట్, ఉత్తమ వ్యాపారవేత్త/పారిశ్రామికవేత్తతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఈ సందర్భంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిని లక్షా నూట పదహారు రూపాయల నగదు పురస్కారం, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరిస్తారు.
ప్రతిభావంతులకు పురస్కారాలు
Published Sat, May 9 2015 5:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement