Sakshi News home page

బాల భీముడు 

Published Wed, Jun 27 2018 2:09 PM

Baby born with four kilos weighing - Sakshi

ఖిల్లాఘనపురం (వనపర్తి): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి లో మంగళవారం ఓ బాల భీముడు జన్మించాడు. మం డలంలోని ఉప్పరిపల్లికి చెందిన ఆం జనేయులు భార్య అనితకు సోమ వారం రాత్రి పురిటినొప్పులు రావడంతో తీసుకొచ్చారు.

మంగళవారం ఉదయం ఆస్పత్రి వైద్యులు అజయ్‌ ఆమెకు సాధారణ కాన్పు చేయగా ఏకంగా 4 కిలోల మగబిడ్డ జన్మించాడు. మామూలుగా  పుట్టిన శిశువు బరువు 2.5 కిలోలనుంచి 3 కిలోల వరకు ఉంటుంది.

మొదటి కాన్పులో 4 కిలోల బిడ్డ జన్మించడంతో అందరు అవాక్కయ్యారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. అనంతరం  ప్రభుత్వం అందించే కేసీఆర్‌ కిట్టును అందించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement