ఓ చిన్నారి మృత దేహం బావిలో కట్టిపడేసిన ఘటన జూల పల్లిలో కలకలం రేపింది. వివరాలు.. జూలపల్లి మండలం వడ్కాపూర్లోని ఓ పాడుబడిన బావిలో మగశిశువు మృతదేహం ఆదివారం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును మూటలో కట్టిపడేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు బావిలో మూటను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న మృతదేహాన్ని వెలికి తీసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సింది ఉంది.