పెద్దపల్లిరూరల్ : తక్కువ ధరకు వస్తుందనో...ఒకటి కొంటే మరొక వస్తువు ఉచితంగా వస్తుందనో ఆశపడితే అసలుకే మోసపోవాల్సి వస్తుంది...కొద్ది రోజులుగా పెద్దపల్లి పట్టణంలో పేరొందిన కంపెనీల సెల్ఫోన్ మెమొరీ కార్డులను తక్కువ ధరకే అమ్ముతున్నట్లు నమ్మించి న ఘరానా మోసగాళ్లు పనిచేయని వాటిని అంటగట్టి అందినంత దండుకున్న విషయం వెలుగులోకి వచ్చిం ది. పెద్దపల్లి మేన్రోడ్డు, అమర్నగర్, కమాన్రోడ్, బ స్టాండ్ తదితర ప్రాంతాలలో ఓ ముఠా తిరుగుతూ స్మార్ట్ఫోన్ కలిగియున్న వినియోగదారులను గుర్తించి 32 జీబీ సామ్సంగ్ మెమొరీ కార్డు ధర దుకాణాల్లో దాదాపు రూ.వెయ్యి వరకు ఉంటుందని తాము కేవ లం రూ.450కే ఇస్తామంటు నమ్మించారు.
ఇంకా కొం దరికైతే కేవలం రూ.200కే విక్రయించారు. తమకు పే రొందిన కంపెనీ 32 జీబీ మెమొరీ కార్డు తక్కువ ధర కు వచ్చింద న్న సంతోషంతో మొబైల్లో కార్డును అమ ర్చి చూస్తే అది పనిచేయనిదని తేలడంతో మోసపోయామని గ్రహించారు. పట్టణంలో ఇలా మెమొరీకార్డుల ముఠా చేతిలో చాలా మంది మోసపోయినట్లు సమాచారం. వారిలో కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
గ్రామాలకు కార్లలో వచ్చి లాటరీ పేరిట అమ్మకాలు
పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలకు కార్లలో వచ్చి రైస్ కుక్కర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి విలువైన వస్తువులున్న బొమ్మలను కార్డుపై ముద్రించి రైస్ కుక్కరు ధరను చెల్లిస్తే కుక్కరును ఇవ్వడంతో పాటు కార్డులో సూచించిన మరో వస్తువును కచ్చితంగా ఉచితంగా పొందవచ్చని ఆశజూపుతున్నారు. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు వస్తాయన్న ఆశతో లాటరీ టికెట్ తీసుకున్న వారికి నాసిరకం సీలింగ్ ఫ్యాన్లు, రైస్ కుక్కర్లను అంటగట్టారు. వాటిని కొనుగోలు చేసిన వినియోగదారుల నుంచి వేలాది రూపాయలను తీసుకుని నకిలీ సామగ్రిని కారులో వచ్చి అంటగడుతున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇప్పటికే మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, రాగినేడు, మూలసాల, భోజన్నపేట తదితర గ్రామాలకు చెందిన పలువురు మోసపోయామంటున్నారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించి తగు చర్యలు తీసుకుని వినియోగదారులు మోసాలకు గురికాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
తస్మాత్...జాగ్రత్త...!
Published Mon, Aug 31 2015 4:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement