హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం నిరు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాబూర్లోని మున్సిపల్ గ్రౌండ్లో గాజుల రామారం పట్టాదారులకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది.
Related news
-
బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్గా డీఐజీ సుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బెస్ట్ కోవిడ్ వారియర్ విమెన్ ఆఫీసర్గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్ విమెన్ కమిషన్ (ఎన్సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి ఖరారు చేశారు. (చదవండి: ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి) డీఐజీ సుమతి లాక్డౌన్ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సేవలందించారు. లాక్డౌన్ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. -
దుబ్బాక ఎన్నికలు: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ,బీజేపీలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ అభ్యర్ధి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రముఖ టీవీ ఛానెల్లో బ్రేకింగ్ నడిచినట్లు ఒక వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది. ఓటమి భయం తో హరీష్ రావు, రఘనందన్ చేసిన కుట్రే ఇది. ఈ కుట్రపై డీజీపీ కి ఫిర్యాదు చేశాం. కేరళలో ఇదేవిధంగా దుష్ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేసింది. కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త కుట్రకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నాడని తమకు అనుకూలమైన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నది లేన్నట్టు.. లేనిది ఉన్నట్టు గోబెల్స్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ప్రజల గొంతు వినిపించాల్సిన ఛానల్స్ కొన్ని పార్టీలే నడిపించడం వల్లే ఈ అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి ఛానల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కోరారు. చదవండి: దుబ్బాక పోలింగ్: చేగుంటలో కలకలం -
ఒక్కడి కోసం ఐదుగురు
హైదరాబాద్: ఓ డిపార్ట్మెంట్ ఆఫీసర్..మరో చీఫ్ సూపరింటెండెంట్, ఒక ఇన్విజిలేటర్.. కాపలాగా హోంగార్డు.. తనిఖీ నిమిత్తం స్క్వాడ్.. ఇలా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆయా కేంద్రాల వద్ద విద్యాశాఖ నియమించిన అధికారులు. ఈ అధికారులంతా ఒకే ఒక విద్యార్థి కోసం విధులు నిర్వర్తించిన ఘటన కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. గురువారం జరిగిన సోషల్ పేపర్–1కు మొత్తం 11 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సాయి సందీప్ అనే విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఈ ఒక్కడి కోసం వీరంతా తమ విధుల్ని నిర్వర్తించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ప్రతినిధి స్కూల్కు చేరుకుని సాయి సందీప్ను పరీక్ష ఎలా రాశావని పలకరించగా అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు. -
స్ట్రాంగ్రూంలను పరిశీలించిన కమిషనర్
గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ 8 డివిజన్లలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను భద్ర పరిచే విషయంపై ఐడీపీఎల్ కాలనీ స్కూల్ను మంగళవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పరిశీలించారు. మొత్తం నాలుగు స్ట్రాంగ్ రూంలతో పాటు 8 వార్డులకు ఒకటి చొప్పున కౌంటింగ్ హాల్లను గుర్తించారు. ఈఈ పర్యవేక్షణలో స్థానికంగా ఏర్పాట్లు జరగాలని ఆమె ఆదేశించారు. సర్కిల్ పరిధిలో మొత్తం 4,53,100 ఓటర్లు ఉండగా 429 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉప కమిషనర్ గీత రాధిక తెలిపారు. -
‘మంత్రులకు నేను చెప్పిందే వేదం’
ఇదీ మోసగాడు రాకేష్రెడ్డి మాట తీరు కుత్బుల్లాపూర్: ‘‘మంత్రులకు నేను చెప్పిందే వేదం. ఏం చెప్తే అదే చేస్తారు.... ఎంపీలు... ఎమ్మెల్యేలు నాకు క్లోజ్.. హీరోయిన్సా.. వారి సంగతి నాకు వదిలేయ్’’.. అంటూ ఇతరులను ఇట్టే బుట్టలో వేసుకోవడం రాకేష్రెడ్డి నైజం.. టీడీపీ తెలుగు యువత నేతగా కుత్బుల్లాపూర్లో వెలుగు వెలిగిన రాకేష్రెడ్డి గురువారం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో కేడీగా మారిన విషయంపై ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇతను గత మూడేళ్లుగా టీడీపీలో తిరుగుతూ కీలక నేతల కుమారులతో స్నేహం చూస్తూ వారిని ఆకట్టుకునేలా వ్యవహరించేవాడని తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన రాకేష్రెడ్డి క్రికెట్ బెట్టింగ్స్ కాసేవాడు. బుకీలకు ఫోన్ల ద్వారా బెట్టింగ్లు చెప్పేవాడు. గెలిస్తే వెళ్లి డబ్బు తీసుకొనేవాడు.. ఓడితే మాత్రం బుకీలకు చుక్కలు చూపెట్టేవాడు. బూకీలు నిలదీస్తే మాజీ మంత్రుల కుమారుల పేర్లు చెప్పి తప్పించుకునే వాడు. మొదట స్నేహం.. ఆపై ద్రోహం రాకేష్రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. ఎవరి వద్దా పట్టుమని నమ్మకంగా పది రోజులు కూడా ఉండడు. వారి వద్దకు వచ్చే ప్రముఖల నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. తర్వాత వారికి ఫోన్ చేసి బెదిరించి డబ్బు గుంజుతాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వద్ద కొన్ని రోజులు నమ్మకంగా ఉన్న రాకేష్రెడ్డి వ్యవహార శైలిని గుర్తించి వెంటనే అతన్ని పక్కకు తప్పించారు. అక్కడి నుంచి మకాం మార్చిన ఇతను నగరానికి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులతో సన్నిహితంగా ఉంటూ వారిని కూడా ఇదే తరహాలో మోసం చేయడంతో వారు తరిమి కొట్టారు. చివరి ప్రయత్నంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి డబ్బు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అప్పులు చేసి గోవాలో ఎంజాయ్... రాకేష్రెడ్డి టీడీపీ తెలుగు యువత నాయకుడిగా తనకు తానే ప్రకటించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొనేవాడు. టీడీపీ నాయకుడిగా తనను నమ్మినవారి వద్ద సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసిన రాకేశ్రెడ్డి వారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అప్పు తీసుకున్న డబ్బుతో గోవాలో జల్సాలు చేస్తున్నాడు. ఈనెల 3వ వారంలో రాకేష్రెడ్డిపై ఫిర్యాదులందగా పోలీసులు ఆరా తీయగా గోవాలో ఉన్నట్టు తెలిసింది. ఈనెల 16న నగరానికి వచ్చిన రాకేష్రెడ్డిని క్రైం పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పెద్ద ఎత్తున వ్యాపారులను, ఇతరులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే అతను చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తమే వసూలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏదేమైనా టీడీపీ నాయకులతో తిరుగుతూ జల్సాలు చేసిన రాకేష్రెడ్డి పోలీసులకు పట్టుబడటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు.
Related News by category
-
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని మండిపడ్డారు. శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీర్పూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెనక కాంగ్రెస్తో పాటు విదేశీ హస్తం ఉంది. మీ(ప్రజల) పిల్లల ఆస్తులను ముంస్లికు ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ఆణ్వాయుధాలను నాశనం చేయనున్నారు. కులం, మతం పేరుతో దేశం మొత్తాన్ని విభజించనున్నారు. టుక్డే-టుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ చుట్టూ చేరి.. ఆ పార్టీ సిద్ధాంతాలను హైజాక్ చేస్తోంది. మీ( ప్రజలు) సంపద మీతోనా ఉండలా? లేదా ముస్లింలకు వెళ్లాలా? మీరే నిర్ణయం తీసుకోండి. మేము ముస్లింకు అన్ని హక్కులు సమానంగా కల్పించాం. కానీ, మత ప్రాతిపదికన మేము హక్కులు కల్పించలేదు. ఎందుకుంటే అవి ప్రజలందరి హక్కు’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.#WATCH | Hamirpur, Himachal Pradesh: Union Minister Anurag Thakur says, "In the Congress manifesto, along with the hand of the Congress, hands of foreign forces are also visible who want to give your children's property to Muslims, finish the nations nuclear weapons, divide the… pic.twitter.com/3dxJE6avvz— ANI (@ANI) April 27, 2024 అనురాగ్ ఠాకుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ఠాకుర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాయ్బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!
దక్షిణాదిలో కొంతవరకూ తమ ఎన్నికల పోరు ముగిసిన తరువాత కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని తమ రాయ్బరేలీ కోటను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో రాయ్బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు (ఆదివారం)వెల్లడికానుంది.ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆమె పేరును పార్టీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రియాంక గాంధీ పోటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్బరేలీకి రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఈరోజు (ఆదివారం) చాలా ముఖ్యమైన రోజు. నేడు ప్రియాంక పోటీపై ఢిల్లీ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము ఢిల్లీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదిఏమైనప్పటికీ రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలోనూ ఇదే పరిస్థితి! లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్దళ్తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 7, ఛత్తీస్గఢ్లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి. -
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు. -
‘అర్బన్ నక్సల్స్’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు
భరూఛ్: ఓటు వేసి అర్బన్ నక్సలైట్లను ఎన్నుకునే పొరపాటు ఎప్పుడూ చేయొద్దని గుజరాత్ ఓటర్లకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హితవు పలికారు. గుజరాత్లోని భరూఛ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మన్సుఖ్ వాసావా తరఫున శనివారం ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడారు. ‘‘ మన్సుఖ్లాంటి చక్కని ప్రజా ప్రతినిధి ఇంకొకరు మీకు దొరకదు. పొరపాటున వేరేవాళ్లకు ఓటేస్తే అర్బన్ నక్సలైట్లలో ఒకరు ఎంపీ సీటులో కూర్చుంటారు. ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తారు. ప్రజలను లూటీచేసేందుకు ఆప్, కాంగ్రెస్ కలిసి వచ్చాయి. కాంగ్రెస్ గిరిజనుల వ్యతిరేక పార్టీ.ఓట్లేశాక ఆప్ గిరిజనులను గాలికొదిలేస్తుంది. 400 మెజారిటీతో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆప్, కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలు. అబద్ధాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నైపుణ్యం సాధించింది. ఆప్ సర్దార్ స్థాయికి ఎదిగింది. నిజంగానే మేం రాజ్యాంగాన్ని మార్చేవారమే అయితే ఈ పదేళ్లు అధికారంలో ఉన్నపుడే మార్చేవాళ్లంకదా?’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను మేం ముట్టుకోబోం.ఎవరినీ ముట్టుకోనివ్వం కూడా. గిరిజనుల ప్రాథమిక హక్కులను ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) లాగేసుకుంటుందని ఆప్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. యూసీసీకి గిరిజనులకు సంబంధమే లేదు. భరూఛ్లో ఆప్ అభ్యర్థి ఛైతర్ వాసావా లేనిపోనివి ప్రచారంచేస్తున్నారు. ఆదివాసీలకు మోదీ ఎల్లప్పుడూ మిత్రుడే’’ అని అమిత్ షా చెప్పారు.
Advertisement
Photos
View allVideo
View allఅతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement