వందలాదిగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు
శోకసంద్రంగా మారిన గిర్మాజీపేట
ఎల్బీనగర్ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
వరంగల్ నగరంలోని గిర్మాజీపేట శోకసంద్రంగా మారింది. హిమాచల్ప్రదేశ్ దుర్ఘటనలో అఖిల్ మృతిచెందగా... అతడి భౌతికకాయం మంగళవారం నగరానికి చేరుకుంది.తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య సాయంత్రం అంత్యక్రియలు జరిగారుు.
వరంగల్ చౌరస్తా : తాము పడుతున్న కష్టాన్ని దిగమింగుతూ కుమారుడిని గొప్ప చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు కన్న కలులు కల్లలయ్యూరుు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారి ఇంటికి చేరాడు. 16 రోజుల ఎదురు చూపుల తర్వాత ఇంటికి చేరిన అఖిల్ అంత్యక్రియలు అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య మంగళవారం ముగిశారుు.
వరంగల్లోని 21వ డివిజన్లోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు మౌనిక, కుమారుడు అఖిల్ ఉన్నారు. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న అఖిల్ ఈనెల 3న స్టడీ టూర్ కోసం తోటి విద్యార్థులో కలిసి వెళ్లాడు. ఈ నెల 8న ిహ మాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో ఫొటోలు దిగుతుండగా డ్యాం గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వచ్చిన నీళ్లలో అఖిల్తో సహా 24 మంది విద్యార్థులు కొట్టుకుపోరుున విషయం తెలిసిందే. రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిన 15 రోజుల తర్వాత అఖిల్ మృతదేహం లభించింది. సోమవారం అదేరాష్ట్రంలోని మండి జిల్లా కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి రోడ్డుమార్గంలో ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి ఉదయం 11.50 గంటలకు చేరుకుంది. అక్కడే ఉన్న వరంగల్ ఆర్డీఓ మధు, తహసీల్దార్ రవి అఖిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బంధువులకు అప్పగించారు. అంబులెన్స్లో సాయంత్రం 4.15 గంటలకు గిర్మాజీపేటలోని ఇంటికి మృతదేహం చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తూ అంబులెన్స్ వద్దకు వెళ్లారు. వారి రోదనలతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోరుుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారంతా అఖిల్ను కడసారి చూపు చూసుకోవాలని ఆతృతగా చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. మృతదేహం 15 రోజులపాటు నీళ్లలో ఉండటంతో దుర్వాసన రాకుండా పూర్తిగా ప్యాక్ చేసి, బాక్సులో పెట్టారు. దీంతో శవపేటికపై కప్పిన అఖిల్ ఫ్లెక్సీ వద్ద నివాళులు అర్పించారు. అప్పటికే బంధువులు, స్నేహితులు, స్థానికలు, నాయకులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. అఖిల్ తల్లిదండ్రులు మిట్టపల్లి సంజయ్, సునీత , అక్క మౌనిక, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
జేసీ, అర్బన్ ఎస్పీ, ఇతర అధికారుల నివాళి
అఖిల్ మృతదేహం వద్ద జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఆర్వో సురేంద్రకరణ్, ఆర్డీఓ మధు, తహసీల్దార్ మధు నివాళులు అర్పించారు. పుష్ఫగుచ్చాలను శవపేటికపై పెట్టారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితోపాటు వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి.రమేష్బాబు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరిరమాదేవి, వైద్యురాలు ప్రమీల, బీజేపీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ నాయకులు, బాకం హరి శంకర్, ఎరుకల రఘునారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు బండి కుమారస్వామి, చిన్న గోపి తదితరులు అఖిల్ భాతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
బర్త్డే డ్రెస్ శవపేటికపై కప్పి అంతిమయూత్ర..
ఈ సారి బర్త్డేను తన ఫ్రెండ్స్తో జరుపుకుంటానని చెప్పి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని కొత్తదుస్తులు కొనుక్కొని పయనమైన అఖిల్ బర్త్డే చేసుకోకముందే కానరాని లోకాలకు చేరాడు. ఆ దుస్తులు అతడు ప్రయూణించిన బస్సులోనే ఉండిపోయూరుు. కళాశాల తరఫున వచ్చిన ముగ్గురు ప్రతినిధులు అఖిల్ కుటుంబ సభ్యులకు అతడి బ్యాగ్ను అప్పగించారు. అతడి బర్త్డే దుస్తులను శవపేటికపై కప్పి అంతిమయూత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు సంప్రదాయబద్ధంగా జిల్లేడుచెట్టుకు పెళ్లి చేసి అక్షింతలు వేశారు.
‘బియాస్’ మృతుడు అఖిల్కు అంతిమ వీడ్కోలు
Published Wed, Jun 25 2014 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement