ఐకమత్యానికి ప్రతీక సేవాలాల్ దీక్షలు
41 రోజులపాటు దీక్షలు కొనసాగిస్తున్న బంజారాలు
నార్నూర్, న్యూస్లైన్ : ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు పెట్టింది పేరు.. అలాంటి గిరిజన తండాల్లో ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బంజారాల ఆరాధ్యదైవం, కుల గురువు సంత్సేవాలాల్ మహరాజ్ దీక్షలు చేపట్టి బంజారాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభమైన ఈ దీక్షలు.. 41 రోజులకు ముగించనున్నారు. మరికొంత మంది సోమవారం నుంచి 21 రోజులపాటు దీక్షలు స్వీకరించనున్నారు. కాగా.. దీక్షలు శ్రీరామనవమి రోజున విరమించనున్నారు.
700 మందికి పైనే..
బంజారాల ఆరాధ్యాదైవం కుల గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ పేరిట మహాశివరాత్రి సందర్భంగా అదే రోజున ఈ దీక్షలను బంజారాలు చేపట్టారు. ఆదివారం హోలీ సందర్భంగా సేవాలాల్ భక్తులు దీక్ష భూమి వద్ద సంప్రదాయ పాటలు పాడుతూ, మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
తండాల్లో ప్రతి ఒక్కరూ ఈ దీక్షలను తీసుకుంటారు. దీంతో తండాల్లో 41 రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మండల కేంద్రంలోని కొత్తపల్లి (హెచ్) గ్రామంలో జాతీయ స్థాయిలో బంజారాల దీక్ష భూమి ఉంది. ఇక్కడికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది బంజారాలు వస్తారు.
బంజార కులగురువు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆధ్యాత్మిక మార్గంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని చాటి చెప్పారని పెద్దలు అంటుంటారు. 11 ఏళ్లుగా ఈ దీక్ష భూమి వద్ద బంజారాలు దీక్షలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు.
మండలంలోని కొత్తపల్లిలో 150 మంది, మల్లంగిలో 80 మంది, గంగాపూర్లో 100 మంది, నాగల్కొండలో 80 మంది, రాజన్గూడలో 20 మంది, మాగంలో 50 మంది, బీర్పూర్లో 40 మంది, తాడిహత్నూర్లో 60 మంది, ఉమ్రిలో 50 మంది తదితర గ్రామాల్లో దీక్షలు తీసుకున్నారు.
సంప్రదాయం ప్రకారం..
తరతరాల నుంచి ఈ సంప్రదాయం వస్తోం ది. ఈ తరం వాళ్లు కూడా సంప్రదాయానికి కట్టుబడి సేవాలాల్ దీక్షలను చేపట్టడం ఆనందంగా ఉంది. ప్రతి తండాల్లో సేవాలాల్ దీక్షలను చేపట్టడంతో అంత పవిత్రత నెలకొంది. ఇది ఎప్పటికీ కొనసాగించాలి. - జాదవ్ రవితాబాయి
ఇంటికొక్కరు చొప్పున దీక్షలో..
41 రోజులపాటు తం డాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఇంటికొక్క రు చొప్పున సేవాలాల్ దీక్షలను చేపడుతారు. దీక్షలు చేపట్టం వలన అంతా మంచి జరుగుతుందని నమ్మకం. పురుషులతోపాటు మహిళలు సైతం ఈ దీక్షలను చేపడుతారు. - యశ్వంత్రావ్
తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం
Published Mon, Mar 17 2014 12:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement