అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలపై జిల్లాలో ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ ఇది. ఇదే అంశాలపై భారీగా పందేలు కూడా సాగుతున్నాయి. మూడురోజుల క్రితం వరకూ లక్షల రూపాయలలో నడిచిన బెట్టింగ్ ప్రస్తుతం కోట్లకు చేరింది. జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాలు, సీమాంధ్ర ఫలితాలపై కూడా బెట్టింగులు నడుస్తున్నాయి.
మున్సిపల్, పరిషత్ ఫలితాలు వెల్లడికావడంతో ఇప్పుడు అందరి దృష్టీ సార్వత్రికం పైనే ఉంది. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఫలితాలపై ఎంతవరకూ చూపుతుందీ అన్నదానిపై అన్ని రాజకీయపార్టీల నేతలు, విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. పల్లెలు, పట్టణాల వారీగా విశ్లేషిస్తూ గెలుపు ఎవరిది అనేది కొందరు లెక్కలు తీస్తుండగా, ఈ ఫలితాలను సార్వత్రిక ఫలితాలతో ముడిపెట్టలేమనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఇలా ఏపార్టీ ఎలా లెక్కలు వేసుకున్నా మరో 24 గంటల తర్వాత సార్వత్రిక ఫలితాలు వెలువడనుండడంతో జిల్లా వ్యాప్తంగా అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో పందెంరాయుళ్లు తమపనిలో తామున్నారు. వరుసగా వచ్చిన ఫలితాలు, జరుగుతున్న చర్చలతో జిల్లాలో బెట్టింగులు సైతం జోరందుకున్నాయి. జిల్లాలో అభ్యర్థుల విజయం, తెలంగాణ రాష్ట్రంలో...,సీమాంధ్రలో పార్టీల విజయావకాశాలపై పలువిధాలుగా పందేలు జరుగుతున్నాయి.
రూ.లక్షల నుంచి రూ.కోట్లకు..
పోలింగ్ ముగిసిన వెంటనే... జిల్లాలో ప్రధానంగా ఓ పార్టీ అభ్యర్థికి మెజారిటీ లక్ష దాటుతుందని, ఇతనికి ప్రత్యర్థి, మరో ప్రధాన పార్టీ అభ్యర్థి గెలవడని.. రూ.లక్షల్లో బెట్టింగ్ పెట్టారు. ఫలితాల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ బెట్టింగ్ మరింతగా పెరుగుతోంది. ఈ అభ్యర్థి మెజారిటీపై సరిహద్దు జిల్లాల్లో కూడా భారీఎత్తున పందేలు నడుస్తున్నట్లు చర్చజరుగుతోంది. అంతే కాకుండా సీమాంధ్రలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనేదానిపై సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, మధిరలో భారీగా పందేలు నడుస్తున్నాయి. రెండురాష్ట్రాలలో కీలక స్థానాలలో అభ్యర్థుల విజయం, మెజారిటీపై కూడా పందాలు జరుగుతున్నాయి.
ఇతర జిల్లాల వారు కూడా....
జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై పొరుగు జిల్లాలకు చెందినవారూ దృష్టిపెట్టారు. ముఖ్యంగా సరిహద్దున ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, ఏలూరు, గణపవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కృష్ణా జిల్లాలోని కైకలూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలు కాస్తున్నట్లు సమాచారం. గ్రూపులవారీగా ఈ పందాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రూపులో పది నుంచి 20 మంది వరకు సభ్యులుగా ఉండి రూ.కోటిపైగా బెట్టింగ్కు దిగుతున్నట్లు తెలిసింది. మొత్తంగా ఎప్పుడూ లేనంతగా ఈసారి జిల్లా ఫలితాలపై పందేలు భారీగా సాగుతుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెట్టింగ్.. బెట్టింగ్...
Published Thu, May 15 2014 2:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement