సాక్షి, హైదరాబాద్: రాజకీయకాంక్ష లేకుంటే ఎవరైనా ప్రజల్లో ఎందుకు తిరుగుతారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం విలేకరులు కోదండరాం పార్టీ గురించి, కాంగ్రెస్లోకి కోదండరాంను ఆహ్వానించినట్టుగా జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. కాంగ్రెస్ భావజాలం నచ్చినవారెవరైనా పార్టీలో చేరతారని.. దీనికి ఎవరికీ, ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఉన్నవారెవరైనా పార్టీ పెట్టుకోవచ్చునన్నారు.
రాజకీయ కాంక్షతోనే ప్రజల్లో ఉన్నారు
Published Thu, Nov 16 2017 4:51 AM
Related news
-
డిప్యూటీ సీఎం వాహనాన్ని ఆపిన సీపీ..
మహేశ్వరం: తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనమని.. సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని తెలిసింది. పైగా డ్రైవర్ శ్రీనివాస్పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి చేయి చేసుకున్నారని..అతడి జేబులోని ఐడీ కార్డును లా క్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం. అరగంట తర్వాత తిరిగి ఆ డ్రైవర్ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను చిత్రీ కరిస్తున్న వీడియోగ్రాఫర్, ఇతరుల సెల్ఫోన్లను పోలీసులు లాక్కుని, చేయిచేసుకున్నట్టు తెలిసింది. -
బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
మహబూబ్నగర్: ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంగంబండ రిజర్వాయర్ కింద ఉన్న బండను పగలకొట్టకుండా 15 గ్రామాలకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించింది.. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపులోనూ మొండిచేయి చూపారు.. బండ పగలకొట్టింటే 25 వేల ఎకరాలకు సాగునీరు అందేది.. పైన రిజర్వాయర్ కింద కాల్వలు పూర్తయినా ఒక బండ పగలగొట్ట లేని చరిత్ర ఆ ప్రభుత్వానిది.. వారి నిర్లక్ష్యం వల్ల నీళ్లు లేక పదేళ్ల పాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చింది.. దీంతో 15 గ్రామాల్లో రైతుల పొలాలు ఎండిపోయాయి. సభాముఖంగా హామీ ఇస్తున్నా.. ఈ ప్రాంత రైతుల 19 ఏళ్ల కల నెరవేరబోతుంది.. ఆ బండ పగలగొట్టి సాగునీరు పారిస్తామ’ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం వారు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సంగంబండ లో లెవల్ కెనాల్ కింద ఉన్న సంగంబండను పరిశీలించి ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవల్ కెనాల్ కోసం 500 మీటర్ల బండ తొలగి సంగబండ గ్రామానికి చెందిన ముంపు బాధితులకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు పదేళ్లుగా నిలిచిపోయాయని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు నెలల్లో రూ.12 కోట్లు ప్రభుత్వం ముంపు బాధితుల ఖాతాలో జమ చేసిందన్నారు. ఉజ్జెల్లికి రూ.13.34 కోట్లు, కొత్తగార్లపల్లికి రూ.1.19 కోట్లు జమ చేసేందుకు చొరవ తీసుకుంటామన్నారు. నేరడ్గం, ఆర్ఆర్ సెంటర్లు అనుగొండ, గడ్డంపల్లి గ్రామాలకు సైతం అందాల్సిన బెనిఫిట్స్ అందిస్తామన్నారు. పాలమూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.. పాలమూరు సమస్యలు తెలిసినందుకే జూరాల నుంచి కొడంగల్– నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు మళ్లించే పథకానికి రూ.3 వేల కోట్లు వెచ్చించారని చెప్పారు. మక్తల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ముదిరాజ్ వాకిటి శ్రీహరిని గెలిపించినందుకే ఇక్కడికి వచ్చామని మంత్రులు పేర్కొన్నారు. లక్ష మెజార్టీతో గెలిపించండి! రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డిని ప్రకటించిందని, వంశీని లక్ష మెజార్టీతో గెలిపిస్తే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. వంశీచంద్రెడ్డి గెలవక ముందే రూ.వందల కోట్ల నిధులు పాలమూరుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గెలిచాక తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చేయని విధంగా వంశీ పనిచేస్తాడనే నమ్మకం ఉందన్నారు. విద్యార్థి విభాగం నుంచి యువజన రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన వంశీచంద్రెడ్డి సోనియా, రాహుల్గాంధీలతో అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. వంశీచంద్రెడ్డికి మక్తల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రూ.350 కోట్లు మంజూరు చేయండి: వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలో ఏడు లిఫ్టు ఇరిగేషన్లు పునరుద్ధరించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులను కోరారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో అభివృద్ధికి సహకరించాలన్నారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరులో తమ ప్రాంతం పేరు పెట్టాలని కోరడంతో మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం మార్చారన్నారు. అలాగే మక్తల్లో 33/11 కేవీ సబ్స్టేషన్, సంగంబండ దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు, ఊట్కూర్ మండలం పూలిమామిడిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, నాయకులు బాలకృష్ణరెడ్డి, గోపాల్రెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, సురేశ్కుమార్, రవికుమార్, గణేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వీడిన సస్పెన్స్..! లోక్సభ అభ్యర్థిగా డీకే అరుణ.. -
ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’
కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్గా మారిందా?.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు సీరియస్గా టికెట్ ట్రై చేస్తూ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా?.. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని పోటి అక్కడే ఉండటానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయా?...కాంగ్రెస్కు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలలో మిగత 13చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 13 స్థానాలల్లో కాంగ్రెస్కు ఎక్కువ తలనోప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయాలు అన్నిఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపే టర్న్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది...అయితే బీఆర్ఎస్ లో పెద్దగా పోటి లేకపోవడంతో మళ్లీ నామా కే టికెట్ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్లో ఆ పరిస్థితితి లేదు. టికెట్ కోసం తీవ్రమైన పోటి ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు. బయటకు కనిపించకపోయిన టికెట్ ఎపిసోడ్ లో లోలోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్ను ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు పోటి పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లలు పడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న సమయంలో పొంగులేటి చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి...కేసీఆర్ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు దూకుడు గా ముందుకు వెళ్లారు పొంగులేటి...పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానంలో కూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవనియ్యను. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శపథం పెద్ద సంచనలనానికే దారీతీసింది. ఎవరినా కదిలించిన పొంగులేటి శపథంపైనే చర్చ జరిగింది. దీంతో గత ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోని టికెట్ తన సోదరుడుకి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మరోవైపు డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో భట్టి విక్కమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కీలకంగా తను పనిచేశానని చెప్పుకుంటు భట్టి విక్కమార్క సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అటు మల్లు నందిని సైతం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే అధిష్టానం ప్రయార్టీ ఇస్తుందనే దీమాతో ఉన్నారు. టికెట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు తుమ్మల యుగేంధర్ సైతం కమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు..తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారన్న ఈక్వేషన్స్ తో వారు కూడ రేసులో ముందు వరుసలో ఉన్నామంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు...గ్రూపు పాలిటిక్స్ ను పక్కనే పెట్టి అంత ఒక్కటిగా ముందుకు వెళ్లడంతో ఫలితాలు సైతం కాంగ్రెస్కు అనుకులంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటి పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి..ప్రస్తుతం పైకి అందరు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న టికెట్ విషయంలో చాలా సీరియస్గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు దీమాతో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ పార్లమెంట్ స్థానంకు ఇంత తీవ్రస్తాయిలో పోటి లేదనే చెప్పాలి...అయితే ఒక మంత్రికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మిగత ఇద్దరు మంత్రులు వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తికర చర్చ సైతం నడుస్తుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానంకు మొదట నలుగురు మద్య పోటి ఉండేది. కానీ ఇందులో రేణుక చౌదరికి రాజ్యసభ ఖారారు చేయడంతో కొంత పోటి తగ్గింది అది మూడుకు చేరింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానంకే సవాల్గా మారిన ఖమ్మం పార్లమెంట్ ఎంపిక విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్ఎస్ టెంపరరీ పార్టీ. కొంతకాలం ఉంది. మళ్లీ వస్తుందో లేదో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నికల కోసమే కరెంట్ ఇచ్చేది. కాంగ్రెస్ అలా కాదు. కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. మరికొంతకాలం పాలిస్తుంది. ఎప్పటికీ ఉంటుంది. మాకు బాధ్యతలున్నాయి. ఎన్నికల కోసమే కరెంట్ ఇవ్వం. నిర్ణయాలన్నీ శాశ్వత ప్రాతిపదికతో ఉంటాయి..’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉంటాయన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండించారు. శనివారం భట్టి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జీరో బిల్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు.. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతూ, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కరెంట్ బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదని భట్టి చెప్పారు. అలాంటి వారిని బిల్లు కట్టాల్సిందిగా సిబ్బంది ఏమీ వేధించబోరన్నారు. వారు మళ్లీ ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాలని, తర్వాత ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల)లో ఆ వివరాలు అందించాలని సూచించారు. ఈ వివరాలను పరిశీలించి, జీరో బిల్లులు జారీ చేస్తామని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 40,33,702 కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. గృహజ్యోతి లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా జరుగుతుందని, కొత్త రేషన్కార్డుల జారీ తర్వాత అర్హులకు ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. కచ్చితంగా ఒకటో తేదీన జీతాలు ఇస్తాం భవిష్యత్తులో కూడా కచ్చితంగా ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని నిర్వీ ర్యం చేసిందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్ఎంలను ప్రాధాన్య జాబితాలో చేర్చి వేతనా లిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వదిలేసి పోయిందని.. అందులో తొలుత రూ.10 లక్షలలోపు ఉన్న బిల్లులను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి.. కాళేశ్వరం లాంటివే.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాళే శ్వరం పథకం వంటివేనని.. వాటిలో ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకు భారంగా మారుతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చుచేసినందున వాటిని వాడుకోవాలా, వదిలేయాలా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రిజర్వాయర్లు, కాల్వలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, దీనిపై అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. త్వరలో సంప్రదాయేతర ఇంధన వనరుల పాలసీ తెస్తామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ ఏకంగా 16,500 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని.. ఆమేర సరఫరాకు సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి రాష్ట్ర విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరాం జెన్కో, ట్రాన్స్కోలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరామని భట్టి వెల్లడించారు. బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సిరిసిల్ల విద్యుత్ సహకార సొసైటీ(సెస్)ని ఉత్తర డిస్కంలో విలీనం చేసే అంశంపై నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీ ఎల్ సీఎండీని కోరామని చెప్పారు. కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వలేం సాగు చేయకపోయినా కొండలు, గుట్టలున్న భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని, ఇకపై అలా ఇచ్చేది లేదని భట్టి విక్రమా ర్క స్పష్టం చేశారు. సాగు చేసే రైతులకే ఈ పథకం కింద సహాయం అందుతుందని, సాగు ను ప్రోత్సహించడమే రైతు భరోసా లక్ష్యమని వివరించారు. ఇందిరాక్రాంతి పథం కింద వచ్చే ఐదేళ్లలో పొదుపు సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది టార్గెట్గా పెట్టుకున్నా మని చెప్పారు. ఈనెల 12న వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. -
విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడే
సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ శాఖకు చేస్తున్న ఖర్చు భవిష్యత్ తరానికి పెట్టుబడిగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే వివిధ శాఖలకు సంబంధించి 30వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించామని ఆయన చెప్పారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ)తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్పీఎస్సీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5192 మంది అభ్యర్థులకు సోమవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘ఇరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియం వేదికగా అధికారం చేపట్టింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ పథకం అమలుపై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తొలిఫైలుపై సంతకం చేశారు. గతేడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని చేపట్టింది కూడా ఎల్బీ స్టేడియంలోనే. ఆరు గ్యారెంటీలకు ఇక్కడే సంతకం చేశాం. ఇప్పుడు వరుసగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీని ఎల్బీ స్టేడియం వేదికగానే జరుపుతున్నాం.’’అనిఅన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను గాలికి వదిలేసిందనీ, కేవలం వారి కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా ఫాంహౌజ్ మత్తులో జోగిందని విమర్శించారు. మిగిలిన వారికి త్వరలో ఇస్తాం కొత్తగా 6546 మంది ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 5192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మిగతా వారికి త్వరలోనే అందిస్తామని వివరించారు. ‘గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వ్యక్తిని నేను. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని గుంటూరు, గురజాల కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వ్యక్తి ఈ మధ్య విమర్శలు చేస్తున్నాడు. అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బోధన సాగింది. ఇప్పుడు అలా కాదు. అద్భుతమైన ప్రతిభ ఉన్న వారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. కొత్తగా నియమితులైన గురుకుల టీచర్లు విద్యార్థులకు అత్యుత్తమంగా బోధించాలి. వారికి పాఠ్యాంశ బోధనతో పాటు సామాజిక స్పృహ కలిగేలా... సంస్కృతీ, సాంప్రదాయాలు, విలువలతో కూడిన జీవితం గడిపేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్: ఉపముఖ్యమంత్రి భట్టి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగాలకు సిద్దమయ్యే నిరుద్యోగులు నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి వివరించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియకపోయేదని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ను రూపొందించి త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్త పాల్గొన్నారు.
Related News by category
-
GHMC: మేయర్ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే, లక్ష్మణ్కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ గత రెండు రోజులుగా మేయర్ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు. -
TG: ‘మండలి’ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, సాక్షి: నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్.. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. -
నిప్పుల కొలిమి!
పదేళ్లలో ఇవే అత్యధికంగత పదేళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.11 జిల్లాలకు రెడ్ అలర్ట్..ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. -
ఫేక్ వీడియోలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫేక్ వీడియోల సర్క్యులేషన్పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు వచ్చిన ఫేక్ వీడియోల ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే 47 శాతం పూర్తయిందని, మరో రెండు, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. తద్వారా పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానా లకు తావు ఉండదన్నారు.ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950లోక్సభ ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పాల్గొననున్నారని వికాస్ రాజ్ వెల్లడించారు. ఏడు లోక్సభస్థానాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, 9 స్థానాల్లో 2 బ్యాలెట్ యూని ట్లు వాడాల్సి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనపు బ్యాలెట్ యూనిట్లు రప్పిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్కేంద్రాల వద్ద ఎండ తగలకుండా టెంట్లు..షెడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన టోల్ ఫ్రీ నంబరు ద్వారా 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్లైన్లో వివిధ రకాలుగా 18 వేల ఫిర్యాదులు వచ్చాయని.. అందులో 16 వేలు పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లురాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్రాజ్ తెలిపారు. మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఉండగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నట్లు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.పోలింగ్శాతం పెంచాలని..పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని వికాస్రాజ్ వెల్లడించారు. 5 వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం రికార్డు అవుతున్నట్టు గుర్తించామన్నారు. పోలింగ్ సమయంలో సెక్టార్ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియ నిదానంగా జరిగినా, తక్కువ పోలింగ్ నమోదవుతున్నా వెంటనే అలర్ట్ అయి పరిస్థితిని చక్కదిద్దు్దతారన్నారు. 5, 6 తేదీల్లో హోం ఓటింగ్ఇంటి వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు 23,248 మంది దరఖాస్తులను ఆమోదించినట్టు వికాస్రాజ్ వెల్లడించారు. ఇందులో వయోవృద్ధులు 10,362 మంది, దివ్యాంగులు 11,032 మంది, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఓటర్లు 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5, 6న వీరికి వారి ఇంటి దగ్గరే ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికి 7,185 కేసులు7185 కేసులు నమోదు చేసినట్టు వికాస్రాజ్ తెలిపారు. ఆబ్కారీ శాఖ 6560 కేసులు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కింద 287 కేసులు, ఐపీసీ కేసులు 309, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 21 కేసులు నమోదైనట్లు వివరించారు. రూ. 81 కోట్లు నగదు, రూ.46 కోట్లు విలువైన లిక్కర్, రూ. 26 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.27 కోట్లు విలువ చేస్తే ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.212 కోట్ల విలువైన నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
అంగన్వాడీల రిటైర్మెంట్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పదవీ విరమణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవడం.. మరోవైపు వయోపరిమితి సడలింపు తర్వాత ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల ప్రక్రియ షురూ కావడంతో అంగన్వాడీల రిటైర్మెంట్ల పర్వానికి తెరలేచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమాచార సేకరణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టింది. ఉద్యోగంలో చేరిన తేదీ మొదలు, జిల్లా, ప్రాజెక్టు వివరాలు, వారి పుట్టిన తేదీ, వయసు తదితర వివరాలను నిరీ్ణత ప్రొఫార్మాలో క్షేత్రస్థాయిలో జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(సీడీపీఓ)ల నుంచి తెప్పించుకుంది. గత నెలాఖరు నుంచే రిటైర్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్ల పెంపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణలు మార్చి నెల నుంచే మొదలయ్యాయి. అయితే నూతన వార్షిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మాత్రం ఏప్రిల్ నెలాఖరు నుంచి రిటైర్మెంట్లు అమలు చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలతో 65 సంవత్సరాలు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల వివరాలను ఆ శాఖ సేకరించింది. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్కు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్, అంగన్వాడీ హెల్పర్కు రిటైర్మెంట్ ప్యాకేజీ కింద రూ.50వేలు అందించనుంది. రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పింఛన్ ఇచ్చేలా ప్యాకేజీలో ఉంది. ఏడాది చివరికల్లా 5వేల మంది... రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్చర్లు దాదాపు 50వేల మంది పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు పదవీ విరమణకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించే అంశం లేదు. తాజాగా ప్యాకేజీని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి పదవీ విరమణ ప్రక్రియను చేపడుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5వేల మంది టీచర్లు, హెల్పర్లు రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ ప్యాకేజీ సమ్మతంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ల రిటైర్మెంట్ ప్యాకేజీ ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదు. టీచర్కు రూ.2లక్షలు, హెల్పర్కు రూ.లక్ష ఇవ్వాలని గత ప్రభుత్వం ఎదుట డిమాండ్ పెట్టాం. కానీ అందులో సగానికి తగ్గించి ప్యాకేజీ అంటూ చెప్పడం అన్యాయం. ప్రభుత్వం ఇచ్చే రిటైర్మెంట్ ప్యాకేజీ వారి జీవితానికి ఏమాత్రం సరిపోదు. డిమాండ్ల సాధన కోసం మళ్లీ న్యాయపోరాటం చేస్తాం. – టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
మహాసేన రాజేష్ కు ఘోర అవమానం
కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు
చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement