నడ్డా తెలియకపోవడం విడ్డూరం: దత్తాత్రేయ  | Sakshi
Sakshi News home page

నడ్డా తెలియకపోవడం విడ్డూరం: దత్తాత్రేయ 

Published Wed, Aug 21 2019 6:34 AM

BJP Leader Bandaru Dattatreya Counter On KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు.

Advertisement
Advertisement