సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కరోనా వైరస్ బారినపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం జూబ్లీహిల్స్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. శాంపిల్స్ను పరీక్షించగా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆయన ప్రజల్లో ఉంటూ నిత్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆ కుటుంబంలోని మిగతా సభ్యుల రక్తనమూనాలను పరీక్షలకు పంపడంతో పాటు వారిని క్వారంటైన్ చేశారు. మాజీ ఎమ్మెల్యేకు కరోనా వచ్చిందన్న విషయం బయటికి రావడంతో నియోజక వర్గంలో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే క్షేమంగా బయటికి వస్తానని ఆయన ఓ ముఖ్య నేతతో ఫోన్లో మాట్లాడి సమాచారం కార్యకర్తలకు చేరవేశారు. (దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి)
Related News by category
-
ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందర్రావు ముందుకు డీబీటీ స్కీంలకు నిధుల విడుదల కేసు వచ్చింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది.సంక్షేమ పథకాలకు సంబంధించి (Direct Benefit transfer) డీబీటీ నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్దేశించిన నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘‘రిట్ అప్పీలు వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏవిధంగా పక్కనపెడుతుంది?. లా పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?. తెలంగాణాలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతిచ్చారు? ఈ రాష్ట్రంలో ఈ పథకాలను ఏవిధంగా అడ్డుకుంటారు?’’అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది."హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుంది? న్యాయ సమీక్షాధికారం దీన్ని చూడాల్సి వస్తుంది. 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుతించినప్పుడు అనుసరించిన కోడ్ నియమాలను ఇప్పుడు పాటించడంలేదని స్పష్టం అవుతోంది. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ను ఇప్పుడు అనుసరించలేదని వెల్లడి అవుతోంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీలుకు వచ్చిన నవతరం పార్టీకి హైకోర్టు ప్రశ్నలు వేసింది. "ఎన్నికల్లో అసలు నవతరం పార్టీ ఎన్నిచోట్ల పోటీచేస్తోంది? గతంలో ఎన్నిచోట్ల పోటీచేసింది?" అని ప్రశ్నించింది. అప్పీలు వేసిన లాయర్ల తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందని వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్.. హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం వ్యాఖ్యల అనంతరం హైకోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది నాదకర్ణి క్షమాపణలు చెప్పారు. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు సమయం లేనందున ఈ కేసును జూన్కు వాయిదా వేసింది హైకోర్టు.ఈ కేసులో ఏం జరిగింది?ఏపీలో ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు నిచ్చినట్లయింది. అయితే నిధుల పంపిణీకి సంబంధించి ఏ రకమైన ప్రచారం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఏం చేసింది?హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్నికల సంఘం పరిశీలించింది. దీనికి సంబంధించి సమీక్షించి తమకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది. అయితే ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యాదీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీ విషయంలో సీఈసీ ముందడుగు వేయలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిఫికేషన్ అడిగింది. ఇవ్వాళే డిబిటి నిధులు విడుదల చేయాల్సిన అవశ్యకత ఏముందంటూ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది.మళ్లీ హైకోర్టు ముందుకు ఓ వైపు డిబిటి పంపిణీ నిలిచిపోయినట్టయింది. ఇదే సమయంలో నవతరం పార్టీ పేరిట హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
'విద్యావంతుడినంటావ్'..! ఇదేనా తెలివి.. శ్రీభరత్!!
సాక్షి, విశాఖపట్నం: విద్యావంతుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్.. ఎన్నికల్లో గెలవలేనని తెలిసి రోజురోజుకీ దిగజారిపోతున్నారు. అక్రమాలకు కేరాఫ్గా మారిన దివంగత తాత అడుగు జాడల్లోనే నడుస్తూ.. తన సొంత వర్సిటీ కోసం దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కేంద్రంగా మారిన ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే తప్పుపడుతున్న ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏయూపై ఈసీకి లేఖతో కలకలం!తాజాగా రిటర్నింగ్ అధికారికి రాసిన ఒక లేఖ భరత్ బేలతనాన్ని, అవివేకాన్ని, తేటతెల్లం చేస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కానీ, భారతదేశ ఎన్నికల ప్రక్రియపై కానీ భరత్కు ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిస్తే వాటిని ట్యాంపరింగ్ చేస్తారని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఈవీఎంలను మార్పు చేసేస్తారంటూ ఏకంగా రిటర్నింగ్ అధికారికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలుసా? అసలు పూర్వాపరాలేవీ తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం భరత్కు వారసత్వంగా వచ్చినట్లుందని అందరూ నవ్వుతున్నారు. వాస్తవానికి ఈనెల 13న జరిగే ఎన్నికల తరువాత ఈవీఎంలను ఏయూలో భద్రపరచాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏయూ ప్రాంగణాన్ని వారు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఈవీఎంల భద్రపరిచే భవనంలోకి ఈగ కూడా చొరబడే వీలు లేకుండా అవసరమైన అన్ని చర్యలను దాదాపు నెల రోజుల నుంచి ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఏయూలోనే భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే సజావుగా నిర్వహిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఏ ఒక్క ఓటు గానీ, ఈవీఎం, బ్యాలెట్ బాక్సు కానీ ట్యాంపరింగ్ జరగలేదు. అందుకే ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఏయూనే ఎంపిక చేస్తుందన్న విషయం తెలియకుండా చేసిన ఆరోపణలతో భరత్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈసీపై విశ్వాసం లేదా..?ఎన్నికల సంఘాన్ని దాని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా శ్రీ భరత్ లేఖ రాశారు. ఈవీఎంల భద్రతకు పటిష్టమైన రక్షణ వలయంలో చుట్టూ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరుస్తారు.వీటి జోలికి వెళ్లడం గానీ, వాటిని చూడడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ, వాటిని ట్యాంపరింగ్ చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా.. ఎంపీ బరిలో రెండో సారి ఎలా పోటీ చేస్తున్నారంటూ విశాఖ వాసులు, విద్యావంతులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే తమ ఓటు వృథాగా మారినట్లేనని భావిస్తున్నారు. భరత్ రాసిన లేఖపై టీడీపీ నాయకులే మండిపడుతున్నారు.టీచర్లనీ మార్చేయ్యాలంట.?ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని మారిస్తే సరిపోదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని కూడా మార్చేయాలి అని భరత్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లందరినీ కించపరిచేవిధంగా మాట్లాడటం కూడా భరత్ దిగజారుడు తనానికి నిదర్శమని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే.. గీతం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులను భరత్ బలవంతంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని ఇలా ప్రచారానికి తిప్పడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది -
అభివృద్ధి చేశారిలా...
చేపట్టిన పని పనుల నిధులు సంఖ్య సీసీ రోడ్లు 69 రూ.10.93 కోట్లు సీసీ డ్రెయిన్లు 75 రూ.6.25 కోట్లు మంచినీటి సరఫరా 42 రూ.2.23 కోట్లు వీధిదీపాల నిర్వహణ 14 రూ.67.28 లక్షలు పార్కుల సుందరీకరణ 8 రూ.77.80 లక్షలు నాడు–నేడు (మొదటి విడత) 8 రూ.2.22 కోట్లు నాడు–నేడు (రెండో విడత) 13 రూ.5.91 కోట్లు నాడు–నేడు (రెండో విడత–ఎ) 9 రూ.7.75 లక్షలు వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ 2 రూ.1.01 కోట్లు ఏఐఐబీ పథకం (గోదావరి జలాల సరఫరా) 2 రూ.58.09 కోట్లు పేదలందరికీ ఇళ్లు (రోడ్లు) 8 రూ.2.33 కోట్లు పేదలందరికీ ఇళ్లు పథకం (పూడిక పనులు) 6 రూ.5.07 కోట్లు పేదలందరికీ ఇళ్లు (నీటి సరఫరా) 7 రూ.1.65 కోట్లు డంపింగ్ యార్డు (ఘన పదార్థాలు వేరు చేయడం) 1 రూ.3.29 కోట్లు డంపింగ్ యార్డు ప్రాసెసింగ్ 1 రూ.23.88 లక్షలు మాలకోడు (మురుగునీటి శుద్ధీకరణ) 1 రూ.6.10 లక్షలు మురుగునీటి శుద్ధీకరణ (ప్లాంట్) నిర్మాణం 1 రూ.4.95 కోట్లు మాలకోడు సుందరీకరణ 1 రూ.4.52 కోట్లు జగనన్న కాలనీలో నీటి సరఫరా 1 రూ.5.30 కోట్లు మలవ్యర్థ శుద్ధీకరణ ప్లాంట్ 1 రూ.2.05 కోట్లు చెత్త సేకరణ (ఈ–ఆటోలు) రూ.24.06 లక్షలు రివర్ ఫ్రంట్ పార్కు 1 రూ.1.00 కోట్లు ఈట్ సీ్త్రట్ 1 రూ.80.00 లక్షలు గణపతి జంక్షన్ అభివృద్ధి రూ.67 లక్షలు ఆర్అండ్బీ రోడ్డు 3 రూ.7.80 కోట్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం 1 రూ.200.74 కోట్లు గడ్డర్ బ్రిడ్జి నిర్మాణం 1 రూ.4.65 కోట్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం 1 రూ.19.60 కోట్లు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి 1 రూ.6.00 కోట్లు షాదీ ఖానా నిర్మాణం 1 రూ.1.00 కోట్లు -
రికార్డు మళ్లీ తిరగరాస్తారా
సామాజిక వర్గాల వారీగా ఓటర్లు రెడ్డి 47,918 కమ్మ 12,330 కాపు 43,577 బీసీ 73,558 ఎస్సీ 33,270 ఎస్టీ 1,161 వైశ్యులు 1,852 బ్రాహ్మణులు 2,585 క్షత్రియులు 1,058 ముస్లింలు 1,909 ట్రాన్స్జెండర్ 2 ఇతరులు 3,828 మొత్తం ఓటర్లు 2,23,048 అ న ప ర్తి లో పెదపూడి: ఒకప్పుడు అనపోతవరం లేదా అనపర్రుగా పిలుచుకునే అనపర్తికి రాజా అనపోతారెడ్డి కారణంగా ఆ పేరొచ్చిందని నానుడి. కాటన్ దొర పుణ్యమా అని పచ్చని పంట పొలాలతో కళకళలాడే అనపర్తి ప్రాంతం వ్యవసాయానికే కాదు వడ్డీ వ్యాపారులకు సైతం పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనపర్తి సమీప గ్రామాలకు చెందినవారు వడ్డీ వ్యాపారులుగా స్థిరపడ్డారు. అంతేకాదు ఎన్నో దశాబ్దాలుగా గోదావరి జిల్లాల్లోని ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా అనపర్తికి పేరుంది. నియోజకవర్గ ముఖచిత్రం అనపర్తి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకూ ఆ పేరుతోనే నియోజకవర్గం మనుగడ సాగిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలు జరిగినప్పుడల్లా భౌగోళికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సోమేశ్వరం, తాపేశ్వరం ఫిర్కాలతో కూడిన అనపర్తి నియోజకవర్గం ఏర్పడింది. అనంతరం 1978లో సమితి ప్రాతిపదికగా జరిగిన పునర్విభజనలో నియోజకవర్గం కొత్తరూపును సంతరించుకుంది. 1985లో ఏర్పడిన మండల వ్యవస్థ తరువాత అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాలు మాత్రమే ఉండేవి. 2009 ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో అనపర్తి నియోజకవర్గంలోని రాయవరం మండలాన్ని మండపేట నియోజకవర్గంలో విలీనం చేసి జగ్గంపేట నియోజకవర్గంలోని రంగంపేట, సంపర నియోజవర్గంలో ఉన్న పెదపూడి మండలాలను అనపర్తి నియోజకవర్గంలో కలిపారు. నాటి నుంచి అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాలున్నాయి. రసవత్తర రాజకీయ పోరు 1952 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరగగా మూడు పర్యాయాలు తప్ప మిగిలిన 12 సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందితే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారం చేపడుతుందన్న సెంటిమెంట్ ప్రజల్లో నెలకొంది. సర్పంచ్లకు సైతం ఎమ్మెల్యేలుగా పట్టం కట్టిన చరిత్ర అనపర్తి నియోజవర్గం సొంతం. రామవరం సర్పంచ్గా గెలిచిన మూలారెడ్డి టీడీపీ నుంచి 1983లో, అనపర్తి సర్పంచ్గా గెలిచిన రామారెడ్డిని కాంగ్రెస్ తరపున 1989, 2004ల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. 1952లో అనపర్తికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన పడాల సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1955లో సీపీఐకి చెందిన కొవ్వూరి వెంకటరెడ్డిపై ప్రజా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తేతలి లక్ష్మీనారాయణరెడ్డి గెలుపొందారు. 1962లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేతలి లక్ష్మీనారాయణరెడ్డిపై సీపీఐ అభ్యర్థి పాలచర్ల పనసరామన్న విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో వల్లూరి రామకృష్ణ చౌదరి కాంగ్రెస్ తరుపున పోటీలో నిలిచి స్వతంత్ర అభ్యర్థి గొలుగూరి వెంకటరెడ్డిపై విజయం సాధించారు. 1972లో వల్లూరి రామకృష్ణ చౌదరి(కాంగ్రెస్) ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో రాజకీయ దిగ్గజంగా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి వుండవిల్లి సత్యనారాయణమూర్తి(రాయవరం మునసబు)ను ఢీకొని కొమరిపాలెంకు చెందిన పడాల అమ్మిరెడ్డి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పడాల అమ్మిరెడ్డిపై పోటీ చేసిన నల్లమిల్లి మూలారెడ్డి గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన నల్లమిల్లి మూలారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తేతలి రామారెడ్డి గెలుపొందారు. తదుపరి 1994, 1999ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తేతలి రామారెడ్డిపై టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి విజయం సాధించారు. 2004లో తిరిగి నల్లమిల్లి మూలారెడ్డిపై తేతలి రామారెడ్డి గెలుపొందారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా డీఆర్కే రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి మూలారెడ్డిలపై కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన నల్లమిల్లి శేషారెడ్డి విజయ కేతనం ఎగురవేశారు. ముచ్చటగా మూడోసారి ప్రత్యర్థులుగా అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,373 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి 55,208 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డులు తిరగరాశారు. ఇప్పటివరకూ అనపర్తి నియోజకవర్గంలో జరిగిన 15 ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. మరో మూడు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముచ్చటగా మూడోసారి ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు. 2019 ఎన్నికల కంటే మించిన మెజార్టీ సాధించే లక్ష్యంతో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముందుకు సాగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి ప్రజల్లో విశ్వాసం, అవినీతి రహిత పాలన, నిరంతరం ప్రజల్లో ఉండడం కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర అవినీతి ఆరోపణలతో వ్యతిరేకత మూటగట్టుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లోనూ ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లు మండలం గ్రామాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం అనపర్తి 11 28,433 30,690 0 59,123 బిక్కవోలు 13 27,675 29,510 1 57,186 రంగంపేట 16 23,724 23,714 1 47,439 పెదపూడి 18 29,434 29,866 0 59,300 58 1,09,266 1,13,780 2 2,23,048 2019 ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్సీపీ 1,11,169 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ 56,240 రేలంగి నాగేశ్వరరావు జనసేన 12,800 వై.ఏ.వడయార్ కాంగ్రెస్ 1,127 మేడపాటి హరినారాయణరెడ్డి బీజేపీ 622 అనపర్తి నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకూ వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి పథకం పేరు లబ్ధిదారులు ఆర్థిక సహాయం (రూ.కోట్లలో) వైఎస్సార్ పెన్స్న్ కానుక 46,777 496.81 జగనన్న అమ్మఒడి 44,141 131.61 వైఎస్సార్ చేయూత 15,869 62.99 వైఎస్సార్ రైతు భరోసా 42,362 154.10 వైఎస్సార్ నేతన్న నేస్తం 360 1.84 వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్హెచ్జీ) 43,536 195.39 వైఎస్సార్ ఆసరా 34,123 174.99 నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు 13,118 145.29 వైఎస్సార్ ఉచిత పంటల బీమా 26,262 69.18 వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు 16,690 6.52 వైఎస్సార్ కాపు నేస్తం 5,429 23.85 రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ 24,348 23.37 జగనన్న వసతి దీవెన 11,564 48.52 జగనన్న విద్యా దీవెన 14,326 37.47 ఈబీసీ నేస్తం 5,852 14.24 వైఎస్సార్ బీమా 630 11.07 మొత్తం 3,45,387 1597.32 ఇతర పథకాలు జగనన్న చేదోడు 2,605 5.02 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 13,012 43.68 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 7,933 9.03 వైఎస్సార్ లా నేస్తం 14 0.12 వైఎస్సార్ కల్యాణమస్తు/షాదీ తోఫా 119 1.32 అర్చకులు/ఇమామ్లు/మౌజామ్లు/పాస్టర్లు 192 2.96 వైఎస్సార్ మత్స్యకార భరోసా 103 0.19 మొత్తం 23,978 62.36 నియోజకవర్గ ప్రత్యేకతలు అనపర్తి నియోజకవర్గం రైసు మిల్లులు, పౌల్ట్రీ పరిశ్రమలకు పెట్టింది పేరు. అనపర్తి మండలం పులగుర్తలో చేనేత సొసైటీకి మంచి పేరుంది. అలాగే అనపర్తిలో ఐటీసీ లిమిటెడ్ ఐఎల్టీడీ కంపెనీ ఉంది. దీంట్లో ఇండియన్ లీఫ్ టుబాకో గ్రేడింగ్ చేస్తారు. బిక్కవోలులో రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీగణపతి ఆలయం, కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. అలాగే పెదపూడి మండలం జి.మామిడాడలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయం, కోదండరామాలయాలున్నాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఐదు రోజుల పాటు అనపర్తి వీరుళ్లమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తారు. లక్షల్లో భక్తులు వీరుళ్లమ్మను దర్శించుకుంటారు. అనపర్తి రైల్వేస్టేషన్లో రోజూ 34 రైళ్లు ఆగుతాయి. రామచంద్రపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల ప్రజలంతా ప్రధానంగా ఈ స్టేషన్ నుంచే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇటీవల అమృత భారత్ కింద రూ.31 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆదిత్య బిర్లా వారి గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ సుమారు 4 వేల మంది పనిచేస్తున్నారు. 20వ శతాబ్దపు ప్రముఖ రచయితల్లో ఒకరైన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అనపర్తి మండలం పొలమూరుకు చెందినవారే కావడం విశేషం. బిక్కవోలు మండలం కొంకుదురు జాతీయ గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జన్మస్థలం. రాష్ట్ర రాజకీయాలకు అనపర్తి సెంటిమెంట్ దశాబ్దాలుగా వాణిజ్య కేంద్రంగా వెలుగులు -
రాజమహేంద్రవరంపై సీఎంకు ప్రత్యేక అభిమానం
● రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ కేటాయించనంతగా నగరానికి నిధులు ● రాజమండ్రి సిటీలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయం ● వైఎస్సార్ సీపీ సీనియర్ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి సిటీ నియోజకవర్గమంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమితమైన అభిమానమని, రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ కేటాయించనంతగా నిధులు మంజూరు చేయడమే దీనికి సాక్షిగా నిలుస్తోందని ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సిట్టింగ్ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరబోతోందని చెప్పారు. ప్రజల నాడి గ్రహించే ఈ విషయం చెబుతున్నానని స్పష్టం చేశారు. నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టనున్నారని, భరత్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. తాను పార్టీకి ఎప్పుడూ దూరంగా లేనన్నారు. సీఎం జగన్ తనకు సూచించిన విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తున్నానని చెప్పారు. సీఎంను పదవులు కోరేందుకు తాను కలవలేదన్నారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పి.మిథున్రెడ్డి తనపై అభిమానంతోనే తన ఇంటికి వచ్చారని అన్నారు. పార్టీ జెండాయే తన అజెండా అని చెప్పారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయం కోసం పని చేయడం తనకు చేతకాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాజమండ్రి సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తనను కోరారని తెలిపారు. రాజమండ్రి నగర అభివృద్ధిలో భరత్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో నమ్మకం – విశ్వాసం ఒకవైపు, మోసం – అబద్ధాలు మరోవైపు పోటీ పడుతున్నాయని, ప్రజలు మంచివైపు మొగ్గు చూపాలని కోరారు. ప్రజలకు సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని అందించారని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భరత్ను, ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి, జననేత జగన్కు బహుమతిగా ఇవ్వాలని శ్రీఘాకోళ్లపు కోరారు. మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా వైఎస్సార్ సీపీకి ఎవరూ దూరంగా లేరని, ప్రతి ఒక్కరూ నిజాయతీగా పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని అన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం తనకు అత్యంత ఆప్తులని, నిజాయతీగా పని చేసే నాయకుడని కొనియాడారు. సమావేశంలో రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement