- నిమిషాల్లో ఆధార్, ఓటర్ ఐడీ కార్డుల తయారీ
- నగరంలో యథేచ్ఛగా దందా
ప్రగతినగర్ : బోగస్ పత్రాలతో కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను దర్జాగా స్వాహా చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, టెన్త, ఇంటర్ తదితర సరిఫికెట్లను నిమిషాల్లో తయారు చేసి లక్షలు గడిస్తున్నారు. బోర్గాం, దుబ్బ మీ సేవ కేంద్రాల్లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన సంఘటన వెలుగు చూసింది. కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఓ సెంటర్ నిర్వాహకుడు వీరందరికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
వెయ్యి రూపాయల పింఛన్ వీరికి కాసుల వర్షం కురిపించింది. పేరు మార్పిడి, చిరునామా, వయసు మార్చి అనర్హులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఉదాహరణకు ఓటరు నమోదు కార్డు కావాలంటే ముందుగా వీ సేవ సెంటర్లో టెన్త మెమో లేదా 18 సంవత్సరాలు నిండిన వయస్సు ధ్రువీకరణ పత్రంతో పది రూపాయలు చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అధికారులు విచారణ చేసి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఈ కార్డు కావాలంటే సుమారు రూ.వెయ్యి, ఒక పాస్పోర్టు ఫొటో ఇస్తే చాలు.. వారి దగ్గర ఉన్నా డాటా ఫార్మాట్లో పేరు నమోదు చేసుకుని హోలోగ్రాం, ఎలక్ట్రోరల్ అధికారి సంతకాలు చేసి గంటలో ఓటరు కార్డును తయారు చేసి ఇస్తున్నట్లు తెలిసింది.
ఓటరు కార్డు ఆధారంగా కులం, ఆదాయం, నివాసం, లోకల్, సదరం తదితర సర్టిఫికెట్లను పొందుతున్నారు. ఈ సర్టిఫికెట్లను చూపి సదరు బోగస్దారులు పాస్పోర్టుకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కూడా ఈ నకిలీ ఓటరు గుర్తింపు కార్డును ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. గత జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ 24వ డివిజన్లో ఒకేసారి 16 బోగస్ ఆధార్కార్డులను గుర్తించారు. దీంతో నకిలీ కార్డుల దందా అరికట్టేందుకు అధికారులు స్పెషల్ టాస్క్ఫోర్సను ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్స తనిఖీలు చేసి బోర్గాంలోని మీ సేవ సెంటర్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
అదేవిధంగా దుబ్బ, వర్ని రోడ్డులోని మీ సేవ కేంద్రాలను సీజ్ చేశారు. ఇంతలో గోదావరి పుష్కరాలు రావడం, కలెక్టర్ బదిలీ కావడంతో తనిఖీలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీకార్డులు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అంతా నకిలీమయం..
Published Thu, Aug 27 2015 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement