సంపులో పడి బాలుడి మృతి

1 Nov, 2015 18:27 IST|Sakshi

ప్రమాద వశాత్తు సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణంలోని గంగానగర్ లో ఆదివారం జరిగింది. సునీల్(5) అనే బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడ్డాడు. సంపులో బాలుడు పడి సంగతి ఎవరూ గమనించక పోవడంతో.. ఊపిరాడక బాలుడు మరణించాడు.
 

మరిన్ని వార్తలు