ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. | Sakshi
Sakshi News home page

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

Published Sun, Apr 1 2018 8:17 AM

Boy Friend Refused  Married - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురై ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన జిల్లాలోని కురవి మండలం కొత్తూరు(జీ) గ్రామ శివారు తాట్యతండాలో శనివారం రాత్రి జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు గుగులోతు చంద్రూ, శైలజ కథనం ప్రకారం... వీరి రెండో కుమార్తె సౌమ్య(18), అదేతండాకు చెందిన భూక్య కృష్ణ, రూక్మ రెండో కుమారుడు రాంబాబు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం శ్రీరామనవమి రోజున తెలియడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. సౌమ్యని పెళ్లి చేసుకుంటానని రాంబాబు కాగితం రాసిచ్చాడు. మూడు రోజుల తర్వాత వివాహానికి నిరాకరించటంతో శుక్రవారం కురవి పోలీస్‌స్టేషన్‌లో సౌమ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం కురవి ఎస్సై నాగభూషణం బాధితుల ఫిర్యాదు మేరకు భూక్యా రాంబాబు, వారి బంధువులను పోలీస్‌స్టేషన్‌కి పిలిపించి మాట్లాడారు. ఆతర్వాత మహిళా కౌన్సెలింగ్‌ సెంటర్‌కు అప్పగిస్తామని చెప్పి ఇంటికి పంపించారు. ఈలోగా మనస్తాపానికి గురైన సౌమ్య పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement