నిలిచిన హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ | Sakshi
Sakshi News home page

నిలిచిన హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్

Published Fri, Jul 24 2015 12:35 PM

brakes stuck to Hazrat Nizamuddin Express

రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ నుంచి యశ్వంత్‌పూర్ వెళుతున్న హజరత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. ప్రయాణికుల బోగీ బ్రేక్ లైనర్లు పట్టేయడంతో అకస్మాత్తుగా రైలు నిలిచిపోయింది. బ్రేకులు పట్టేసిన బోగీని అక్కడే వదిలి వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. బ్రేకులు పట్టేసిన బోగీలోని ప్రయాణికులు వేరే బోగీల్లో ఎక్కించారు. కాగా, ఈ రైలు సుమారు రెండు గంటలకు పైగా నిలిచిపోవడంతో ఆ మార్గంలో పలు ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement