మోర్తాడ్: మండలంలోని నాలుగు గ్రామాల రైతుల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసి పరారైన దళారీ సలీంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అయితే రైతులకు సంబంధించిన ధాన్యం సొమ్ము మాత్రం పూర్తిగా రికవరీ కాలేక పోయింది. ఏర్గట్ల, బట్టాపూర్, తొర్తి, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసిన సలీం, వారికి రూ.40.59 లక్షలు చెల్లించాల్సి ఉంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లర్లకు విక్రయించిన సలీం వారికి సొమ్ము చెల్లించకుండా పరారీ అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని వారు దర్యాప్తు ప్రారంభించారు.
సలీం సెల్ సిగ్నల్స్ ఆధారంగా పరారీ అయిన తరువాత రెండు మూడు రోజుల్లోనే పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సలీంను వెంటనే రిమాండ్ చేస్తే రైతులకు సంబంధించిన సొమ్ము రికవరీ కాదని భావించిన అధికారులు తమదైన శైలిలో సలీంను విచారించి సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తాను గతంలో చేసిన వ్యాపారం వల్ల నష్టపోయానని అందుకు సంబంధించిన అప్పులు ధాన్యం సొమ్ముతో తీర్చినట్లు సలీం విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అంతేకాక కుటుంబ పోషణ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన సలీం రైతుల సొమ్ము నుంచి ఆ ఖర్చులకు డబ్బును వినియోగించినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
సలీం వద్ద లభించిన నగదుతోపాటు రైస్మిల్లర్ల వద్ద రావాల్సిన సొమ్మును, అతని డీసీఎం వాహనం, ఇతర సామాగ్రిని విక్రయించడంతో రూ. 11.75 లక్షలు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ సొమ్మును పోలీసులు రైతుల ప్రతినిధులకు అప్పగించారు. రైతులే సొమ్మును పంచుకోవాలని సూచించారు. లక్ష రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అమ్మిన రైతుకు రూ. 30.5వేలు మాత్రమే చేతికి అందాయి. రికవరీ అయిన సొమ్మును రైతులకు అప్పగించగా వారు ధాన్యం లెక్కలు తీసి వాటాలను పంచుకున్నారు. అయితే 50 శాతం సొమ్ము కూడా చేతికి అందకపోవడంతో రైతులు నిట్టూర్పు విడుస్తున్నారు.
నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే రైతులకు ధాన్యం సొమ్ము ఇప్పట్లో చేతికి అందేఅవకాశం లేదు. అందువల్ల ఉన్నతాధికారుల సూచన మేరకు రికవరీ అయిన సొమ్మును రైతుల ప్రతినిధులకు అందించినట్లు పోలీసులు తెలిపారు. రైతులకు న్యాయం చేయడం కోసం తాము ఎంతో కృషి చేశామని అన్ని కోణాల్లో విచారించిన తరువాతనే రికవరీ సొమ్మును వారికి అందించామని పోలీసులు చెబుతున్నారు. కాగా రైతులు మాత్రం తమకు న్యాయం జరగలేదని గగ్గోలు పెడుతున్నారు.
రిక‘వర్రీ’
Published Sat, Dec 20 2014 4:36 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement