Sakshi News home page

బాబాయి చేతిలో కొడుకు హతం

Published Sat, Oct 17 2015 3:09 PM

Brutal murder in Mangapet

మంగపేట (వరంగల్) : నువ్వు పంటకు నష్టం కలిగించటంపై ముదిరిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా మంగపేట మండలంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని దోమెడ పంచాయతీలోని గొత్తికోయల ఆవాసం రాళ్లగూడెంకు చెందిన మడకం సంతోష్(30), అతని పినతండ్రి జోగయ్యకు మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. నువ్వు పంట విషయమై గతంలో ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. కత్తి పట్టుకుని చంపేస్తానంటూ వస్తున్న సంతోష్‌ను జోగయ్య గొడ్డలితో తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

Advertisement
Advertisement