బండరాళ్లతో మోది వ్యక్తి హత్య | Sakshi
Sakshi News home page

బండరాళ్లతో మోది వ్యక్తి హత్య

Published Fri, May 29 2015 6:47 PM

Brutal murder in Nizamabad

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలోని మద్నూరు మండలం సలాబత్‌పూర్ గ్రామ శివారులో శుక్రవారం ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్రలోని డెగ్లూర్ కు చెందిన ప్రకాశ్(42)అనే వ్యక్తిని బండరాళ్లతో మోది ఓ వ్యక్తి చంపేశాడు. అనంతరం నిందితుడు డెగ్లూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement