సెంట్రల్ యూనివర్సిటీ: మణిపూర్ ఉదంతంపై నగరంలో నిరసన వెల్లువెత్తింది. విద్యార్థి లోకం తీవ్రంగా స్పందించింది. మనమంతా ఒక్కటేననే సమైక్యతా భావాన్ని చాటింది. ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులూ దాడిని తీవ్రంగా ఖండించారు. మణిపూర్ నిట్లో బీటెక్ చదివే తెలుగు విద్యార్థులపై అక్కడి సీనియర్లు దాడికి పాల్పడ డాన్ని తాము ఎంతమాత్రం సహించబోమంటూ నిరసన వ్యక్తం చేశారు. దాడి హేయమని పేర్కొన్నారు. మణిపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులపై గత గురువారం నుంచి అక్కడి సీనియర్లు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సంఘటనపై హైదరాబాద్లో చదువుకుంటున్న మణిపూర్ విద్యార్థులు స్పందించారు. ఇఫ్లూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన వారంతా తమ రాష్ర్టంలో తెలుగు విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘హైదరాబాద్ ఎంతో మంచి నగరం. ఇక్కడి వాళ్లు మమ్మల్ని ఆప్యాయంగా పలుకరిస్తారు. మేం ఇతర రాష్ట్రంలో ఉంటున్నామనే భావన ఏమాత్రం కలుగదు. ఎంతోమంది తెలుగు మిత్రులను ఇక్కడ సంపాదించుకున్నామ’ని వారు తెలిపారు.తెలుగు విద్యార్థులపై అక్కడి సీనియర్లు చేసిన దాడిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే దాదాపు 200 మంది మణిపూర్ రాష్ట్ర విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. మణిపూర్ ‘నిట్’ ఘటనపై కొంతమంది విద్యార్థుల అభిప్రాయాలను ‘సాక్షి’ తెలుసుకుంది.
వారేమంటున్నారంటే...
నాకు తెలుగు స్నేహితులే ఎక్కువ
హెచ్సీయూలో 2012 నుంచి చదువుకుంటున్నాను. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు. నాకు ఎక్కువ మంది స్నేహితులు తెలుగు విద్యార్థులే. తెలుగు వారు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. మణిపురిల తరువాత నా ఓటు తెలుగు వారికే. అక్కడ జరిగిన దాడి, విద్యా సంస్థల్లో మణిపురిల సంక్షేమంపై త్వరలో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర విద్యార్థులం అనుకుంటున్నాం.
- ఆర్డీ కిమో, ఎంఏ (సోషియాలజీ)
ఫిర్యాదు చేస్తాం
తెలుగు విద్యార్థులపై జరిగిన దాడిపై మణిపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల్లో మణిపూర్ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఘటన వల్ల మా రాష్ట్ర విద్యార్థులపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటివి జరగడం ఏ మాత్రం మంచిది కాదు. దాడులు పునరావృతం కాకుండా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తాం.
- డుటో కె.తేరి, ఎంఏ, హెచ్సీయూ
కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు
ఏ రాష్ట్రంలోనైనా అక్కడక్కడాఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. ఎక్కడైనా ఆకతాయిలు ఉంటారు. కొంతమంది మణిపూర్ విద్యార్థులు చేసిన దాడి వల్ల అందరికీ చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. విజ్ఞానవంతులుగా వ్యవహరించాలే తప్ప రౌడీల్లా కాదు.
- జూలియట్ ఫనాయి, ఎకనామిక్స్ (పీహెచ్డీ)
పరిస్థితిని మెరుగుపరచాలి
మణిపూర్ విద్యార్థులు, తెలుగు వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిస్థితిని మెరుగుపరచాలి. హెచ్సీయూలో నా స్నేహితుడు కూడా తెలుగు విద్యార్థే. అతడు నాకు తెలుగు నేర్పిస్తున్నాడు. మా రాష్ట్ర విద్యార్థులు సైతం పలుచోట్ల అవమానాలకు గురవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో మణిపురిలకు రక్షణ కల్పించాలి.
- సారీ లూయికాం, ఎంఏ సోషియాలజీ
దాడులు దారుణం
Published Tue, Sep 16 2014 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement