- కెరీర్లో మూడుసార్లు సస్పెండ్ అయిన సీఐ నాగయ్య
- అయినా తీరు మార్చుకోని వైనం!
పుల్కల్ : పుల్కల్ పోలీసు స్టేషన్లోని మృతి చెందిన లక్ష్మయ్య మృతికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసిన జోగిపేట సీఐ నాగయ్య వివాదాలకు కేరాఫ్గా మారాడు. గతంలో సైతం నాగయ్య పలు సంఘటనల్లో బాధ్యుడయ్యాడు. దీంతో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడు. తాజాగా లక్ష్మయ్య మృతిపై కూడా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యాడు. నాగయ్య ఎక్కడ పనిచేసినా మచ్చ తెచ్చే సంచలనాలు చోటు చేసుకుంటూ సస్పెండ్ అవ్వడం పరిపాటిగా మారింది.
పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో ఒక్కరిని ఎంచుకుని తన కార్యాలయంలో డిప్యూటేషన్ వేయించుకుని తనకు రావాల్సిన సెటిల్మెంట్లు, లావాదేవీలను వారితో చేయించుకుంటాడనే ఆరోపణలున్నాయి. పుల్కల్ పోలీసు స్టేషన్లో సైత ం తనకు సన్నిహితంగా ఉన్న ఓ కానిస్టేబుల్తో కేసులకు సంబంధించిన వ్యవహారాలకు ప్రతినిధిగా పెట్టుకుని కథను నడిపించేవాడని తెలుస్తోంది. అడిగినంత ఇస్తే చాలు కే సులు కొట్టేస్తాడని.. లేనిపక్షంలో చిత్ర హింసలకు గురి చేస్తారనే ఆరోపణలున్నాయి.
డిసెంబర్ 27న మండల పరిధిలోని ఎస్ ఇటిక్యాల్లో వివాహిత హత్యకు గురైన సంఘటనలో సీఐ నాగ య్య నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఒకరిని మాత్రమే రిమాండ్ మిగిలిన ఇద్దరి నుంచి పెద్ద మొత్తంలో ము డుపులు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. లాకప్లో మృతి చెందిన లక్ష్మయ్య వ్యవహారంలో సైతం హత్యకు గురైన మంజులకు చెందిన బంగారం, అప్పుగా ఇచ్చిన రూ. 2 లక్షలను రికవరీ పేరుతో తాను తీసుకునేందుకే నాలుగు రోజులుగా లక్ష్మయ్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారణ జరిపినట్లుగా తెలిసింది. అయితే లక్ష్మయ్య పోలీస్స్టేషన్లో మృతి చెందడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ సీఐ నాగయ్యతో పాటు పుల్కల్ ఎస్ఐ లోకేష్, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
వివాదాలకు కేరాఫ్..!
Published Sat, Mar 14 2015 12:40 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
2,308 ఎకరాల్లో పంట నష్టం
మరో రెండ్రోజులు వర్ష సూచన
యువత చేతుల్లోనే దేశ పాలన
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కొను‘గోల్’.. జాప్యం
● సెగ్మెంట్లలో ఓట్లు తగ్గితే ఇబ్బందులే.. ● కొత్త, పాత నాయకుల్లో కుదరని సఖ్యత ● కేడర్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ● ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ ఎన్నికలు
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు
శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ క్యాంపు దోహదం
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement