అశ్వారావుపేట, న్యూస్లైన్: అశ్వారావుపేట ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా.. తొలి అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ముంపు మండలాలను తెలంగాణ భూభాగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేయనున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం అశ్వారావుపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆదివాసీలను ఆంధ్రప్రదేశ్లో కలపడం అన్యాయమన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీలను తెలంగాణ ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాక, ఆంధ్రాలో కలిపితే వారి సమస్యలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు.
ఐదేళ్లపాటు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. గోదావరి తల్లిని నమ్ముకుని బతికే ఆదివాసీల హక్కులను కాపాడాలని అసెంబ్లీలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని, అశ్వారావుపేట ప్రాంతంలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు.
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో కార్మికుల ఈపీఎఫ్లను బొక్కేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని కార్మికులకు, రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అశ్వారావుపేటలో డ్రెయినేజీ, సెంటర్లైటింగ్ ఏర్పాటు, పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పుచ్చకాయల రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీ కొల్లు వెంకటరమణ, బండారు శ్రీనివాసరావు, బుచ్చిబాబు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలి
Published Mon, Jun 9 2014 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement