'ఇందూరు'కు తరలివచ్చిన ప్రముఖులు | Sakshi
Sakshi News home page

'ఇందూరు'కు తరలివచ్చిన ప్రముఖులు

Published Mon, Mar 16 2015 7:07 AM

Celebrities moved to Indore

నిజామాబాద్ మండలంలోని నర్సింగపల్లి గ్రామంలో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం వేంకటేశ్వరస్వామి ప్రథమ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగు తున్నారుు. ఆదివారం జరిగిన కల్యాణ మహోత్సవంలో సినీ హీరో కళ్యాణ్ రామ్, సీనియర్ నటుడు చలపతిరావు, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
 

నిజామాబాద్ రూరల్ : నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వన మాల క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నారుు. ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనడానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయూన్ని సందర్శించారు. సినీ హీరో కల్యాణ్‌రామ్, నటుడు చలపతిరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవాల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సినీ నిర్మాత దిల్ రాజు, నర్సింహారెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, నాగేశ్వర్‌రావు, వరేందర్‌రెడ్డి,  మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement