ఎవరు మాట్లాడినా ఎదురుదాడేనా? | Sakshi
Sakshi News home page

ఎవరు మాట్లాడినా ఎదురుదాడేనా?

Published Thu, Nov 10 2016 1:08 AM

ఎవరు మాట్లాడినా ఎదురుదాడేనా?

టీఆర్‌ఎస్‌పై చెరుకు సుధాకర్ ధ్వజం
 హైదరాబాద్: రాష్ట్రం లో ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఎవరు మాట్లాడినా వారిపై ప్రభుత్వంలో ఉన్నవారంతా ఎదురుదాడికి దిగుతున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ప్రజల తరఫున మాట్లాడిన పొలిటికల్ జేఏసీ కోదండరాంపై కూడా ఇలానే దుష్ర్పచారం చేస్తూ దాడులకు దిగుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తమ పార్టీ అలా మౌనంగా ఉండదని, సీఎం ఏం మాట్లాడినా దానికి సరైన సమాధానం చెప్పగలిగే శక్తి తమ వద్ద ఉందని అన్నారు. తల్లి తెలంగాణ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కుందూరు దేవేందర్‌రెడ్డి బుధవారం తెలంగాణ ఉద్యమ వేదిక పార్టీలో సుధాకర్ సమక్షంలో మరో 20మందితో కలసి చేరారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు బడుగు లకు ఏ ఫలితమూ అందలేదన్నారు.  జిల్లాలు కావాలని కోరిన వారందర్నీ జైల్లో పెట్టారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement