Sakshi News home page

రాజకీయాలు వద్దు.. హామీలు నెరవేర్చాలి

Published Tue, Jan 24 2017 3:17 AM

రాజకీయాలు వద్దు.. హామీలు నెరవేర్చాలి - Sakshi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ సెంటిమెంట్‌ రాజకీయాలను పక్కన పెట్టి  ప్రజలకిచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రచారంలో నంబర్‌ వన్‌గా నిలుస్తూ, ఆచరణలో మాత్రం ఏమీ చేయకుండా మభ్యపెడుతున్నారని విమర్శించారు.

మిగులు బడ్జెట్‌ రాష్ట్రమంటూ కనబడని దేవుళ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కానీ కళ్ల ముందు కనిపిస్తున్న బడుగుల సంక్షేమానికి మాత్రం నిధులు ఇచ్చేందుకు కేసీఆర్‌ ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ఆ వర్గాలను ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

Advertisement
Advertisement