24న చలో అసెంబ్లీ: లక్ష్మణ్‌ | Sakshi
Sakshi News home page

24న చలో అసెంబ్లీ: లక్ష్మణ్‌

Published Sun, Mar 19 2017 3:46 AM

24న చలో అసెంబ్లీ: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు హెచ్చరించినా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొండి వైఖరితో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం సరికాదని బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మతపరమైన రిజర్వేషన్ల బిల్లును రాజకీయంగా అడ్డుకుంటామన్నారు.

Advertisement
Advertisement