ఎస్సీల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో చంద్రబాబు కరీంనగర్ నిర్వహించనున్న సభను అడ్డుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి పెద్ద మాదిగ అనిపించుకుంటానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక మారిపోయారన్నారు. ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయి మాదిగలను దారుణంగా మోసం చేశారని చెప్పారు.
మరోపక్క, మార్చి 3న చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ నిరసనలు తెలిపే సన్నాహాల్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో మాదిగ కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఆఫర్లు అందించి ప్రలోభాలకు గురిచేయాలని వారు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎట్టిపరిస్థితిలో తలొగ్గద్దని ఎమ్మార్పీఎస్ నాయకులు భావిస్తున్నారు.