సీఎం ప్రత్యేకాధికారిగా మహబూబ్‌నగర్ ఆర్డీఓ | Sakshi
Sakshi News home page

సీఎం ప్రత్యేకాధికారిగా మహబూబ్‌నగర్ ఆర్డీఓ

Published Fri, Jun 6 2014 2:52 AM

Chief specification recent approval

నేడో రేపో ఉత్తర్వులు
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కు ప్రత్యేకాధికారిగా మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంతరావును ప్రభుత్వం నియమించనుంది. ఈ ఉత్తర్వులు నేడో రేపో జారీ కానున్నాయి.
 
 ఈయన సిద్దిపేట ఆర్డీఓగా పని చేస్తూ గతేడాది జూన్ 29న జిల్లాకు బదిలీ అయ్యారు. ఈనెలాఖరుకు ఆయన జిల్లాకు వచ్చి ఏడాది కానుంది. ఈనెల 4న మెదక్ జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన తొలి బహిరంగ సభలో కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు  హన్మంతరావును నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఇక్కడి నుంచి వెళ్లే అవకాశాలున్నాయి.  జిల్లా అధికారులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement
Advertisement