మురికికాల్వలో పడి చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

మురికికాల్వలో పడి చిన్నారి మృతి

Published Sat, Mar 19 2016 7:36 PM

child killed after fall in drainage

తాండూరు: పారాడుతూ వెళ్లిన ఓ పసివాడు మురికి కాల్వలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు ఇంట్లో సందడి చేసిన చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన తల్లి ఇంటి చుట్టూ వెతకగా మురికి కాల్వలో శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement