సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచా లని గులాబీ పార్టీ నిర్ణయించింది. ముఖ్యనేతలతో మొదటి దశ ప్రచారాన్ని పూర్తిచేసిన ఆ పార్టీ.. ఇక అధినేత కేసీఆర్ను రంగంలోకి దించుతోంది. ఈ నెల 25న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారభేరీని మోగించనున్నారు. సెప్టెంబర్ 2న ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో ప్రగతి నివేదన సభతో ముందస్తు శంఖా రావం పూరించిన ముఖ్యమంత్రి.. ఈనెల 25న ఇబ్రహీంపట్నం, షాద్నగర్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. రేపటితో నామినేషన్ల ఘట్టానికి తెర పడుతుండడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రచారకర్తల జాబితాను కూడా అందజేసిన ఆయా పార్టీలు.. పర్యటనల షెడ్యూల్ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
ఇద్దరు మంత్రులు.. నలుగురు ఎమ్మెల్యేలు
మహాకూటమి అభ్యర్థులను గెలిపించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది. ముఖ్యంగా తమ పార్టీ పోటీచేస్తున్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ముఖ్యనేతలను మోహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇద్దరు ఏపీ మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మూడు స్థానాలు టీడీపీ సిట్టింగ్ స్థానాలు కావడంతో పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. శివారు నియోజకవర్గాలు కావడం, సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండడం, కాంగ్రెస్తో పొత్తు కలిసివస్తుందని అంచనా వేస్తోంది. సమీకరణలన్నీ అనుకూలంగా ఉన్నందున ఈ మూడింటితోపాటు కూకట్పల్లిని కూడా దక్కించుకునే విధంగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని తెలుగుదేశం అధిపతి చంద్రబాబునాయుడు సూచించినట్లు తెలిసింది. అంతేగాకుండా.. తాను కూడా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం
25న కేసీఆర్ రాక
Published Sat, Nov 17 2018 3:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement