ప్రాజెక్టుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష

Published Thu, Jul 21 2016 6:59 PM

ప్రాజెక్టుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష - Sakshi

హైదరాబాద్ :తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, రామదాసు ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ప్రతినెల రూ.2,100 కోట్లు నీటి పారుదల శాఖకు జమ చేయాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత ఖర్చయినా వెనకాడొద్దని ఆయన అన్నారు. వ్యవసాయం, రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ కర్తవ్యమని ఆయన తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పారు. 24 నెలల్లో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement