మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ పరామర్శ | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ పరామర్శ

Published Sat, Dec 20 2014 2:32 AM

cm kcr visits k. ramachandra reddy home

హైదరాబాద్: అనారోగ్యంలో బాధపడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి కె.రాంచంద్రారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం రాజయ్య, ఇతర మంత్రులతో కలిసి సీఎం ఎస్‌ఆర్‌నగర్‌లోని రాంచంద్రానెడ్డి నివాసానికి వచ్చి సుమారు అరగంటసేపు గడిపారు. రామచంద్రారెడ్డి  యోగ క్షేమాలను తెలుసుకున్నారు.

కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న తనను సీఎం పలుకరించి వెళ్లారని, ఇద్దరం ఒకే జిల్లాకు చెందినవారమని రాంచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, ఎమ్మెల్యే మైపాల్‌రెడ్డిలు సీఎం వెంట  ఉన్నారు.
 

Advertisement
Advertisement