వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో చేపట్టిన రోడ్ల వెడల్పు పనుల్లో నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నిర్మాణాలను కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే ఫైల్కు ఇప్పటికీ మోక్షం లభించడం లేదు. రోడ్డు వెడల్పు పనుల్లో ఖాళీ స్థలాలు, భవన నిర్మాణాలను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేందుకు సబ్ కలెక్టర్ ఖాతాలో ఆర్అండ్బీ శాఖ దాదాపు రూ.10.73 కోట్లు జమచేసింది. ఈ డబ్బులు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
పరిహారం డబ్బులు సబ్ కలెక్టర్ ఖాతాలో మూల్గుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిహారం అందడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 2006 జనవరిలో అప్పటి ఇన్చార్జి ఆర్డీవో రాంగోపాల్రావు ఆధ్వర్యంలో అనంతగిరి రైల్వే గేటు నుంచి ఆలంపల్లి చివరి వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. మొదట 100 అడుగుల మేర రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికి స్థానిక నేతలు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మాజీ మంత్రి సబితారెడ్డి చొరవతో చివరకు 80 అడుగుల మేరకు రోడ్డు వెడల్పు చేశారు. ఈ పనుల్లో 300 మందికిపైగానే తమ భవన నిర్మాణాలను, ఖాళీ స్థలాలను కోల్పోయారు. 12,508 చదరపు అడుగుల మేర 264 మంది తమ నిర్మాణాలను నష్టపోయారని అధికారులు గుర్తించారు. 2008 నవంబర్ 26న భూసేకరణకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రోడ్డు వెడల్పు పనుల్లో నష్టపోయిన వారి నుంచి అభ్యంతరాలను సేకరించిన అధికారులు విడుదల చేసిన డ్రాప్ట్ డిక్లరేషన్లో తప్పులు దొర్లాయంటూ పలువురు బాధితులు అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని స్థానిక ఆర్డీవోకు ఆయన ఆదేశించారు. ఈ మేరకు 2009లో అధికారులు పలువురి నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా.. రోడ్డు వెడల్పు పనుల్లో నష్టపోయిన 264 మంది బాధితులకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.10 కోట్ల,72 లక్షల,93 వేలను ఆర్డీవో ఖాతాలో జమచేశారు. ఎవరెవరు ఎంతెంత నష్టపోయారు.. ఏ రేటు ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన తర్వాత నష్టపోయిన మేర పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అధికారులు ఈ నిర్ణయం తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మీరే న్యాయం చేయాలి..
రోడ్డు వెడల్పు పనుల్లో తమ ఇళ్లను, దుకాణాలను కోల్పోయినప్పటికీ అప్పట్లో అధికారులు తయారు చేసిన నష్ట పరిహారం చెల్లించే జాబితాలో తమ వివరాలను పేర్కొనలేదని 190, 191, 203, 204, 206, 207, 210, 435, 436 సర్వేనంబర్లకు సంబంధించిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి రైల్వేగేటు నుంచి సినిమాక్స్ వరకు కాకుండా ఆలంపల్లి చివరి వరకు కొనసాగించిన రోడ్డు వెడల్పు పనుల్లో నిర్మాణాలను కోల్పోయిన ప్రతి బాధితుడికీ నష్ట పరిహారం అందేలా కొత్తగా ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందించే విషయంలో గతంలో ఏ ప్రజాప్రతినిధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదని.. అధికారులు సైతం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే సారూ.. మీరైనా ఆదుకోరూ!
Published Sun, Jun 22 2014 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement