సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత, వైఎస్.వివేకానందరెడ్డి పేదల పక్షపాతిగా పేరొందారని, ఆయన మరణం పార్టీకి, వైఎస్సార్ కుటుంబానికి తీరనిలోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్బాబు అన్నారు. వైఎస్.వివేకానందరెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ శుక్రవారం నగరంలోని పలు కూడళ్ల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్కినేని సుధీర్బాబు మాట్లాడుతూ కడప జిల్లా ప్రజలతో, రైతులతో, ఆడపడుచులతో వివేకానందరెడ్డికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.
జిల్లాలోని వైఎస్సార్ కుటుంబ అభిమానులు వివేకానందరెడ్డి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోషిరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గుండపునేని వీరారెడ్డి, బోనకల్ మండల అధ్యక్షుడు షేక్ మౌలాలీ, ముదిగొండ మండల అధ్యక్షుడు సామినేని రవి, మధిర మండల అధ్యక్షుడు ఐలూరి ఉమామహేశ్వరరెడ్డి, టౌన్ ఎస్టీ సెల్ కార్యదర్శి బానోతు వీరూనాయక్, ఖమ్మంటౌన్ 26వ డివిజన్ అధ్యక్షుడు గొట్టిపర్తి గోపి, బానోతు లకుపతి నాయక్, వెంగళ్దాస్ గోపి పాల్గొన్నారు.