'సోనియా కృతజ్ఞతా దినోత్సవం' | Sakshi
Sakshi News home page

'సోనియా కృతజ్ఞతా దినోత్సవం'

Published Tue, Jun 2 2015 12:16 PM

congress celebrates telangana formation day as thanksgiving day to sonia gandhi

హైదరాబాద్: తెలంగాణ అమరవీరులను టీఆర్ఎస్ సర్కారు విస్మరించడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సోనియా గాంధీ కృతజ్ఞతా దినోత్సవంగా టి.కాంగ్రెస్ నాయకులు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగురవేశారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పటికీ కేసీఆర్ సర్కారు చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఆమె పేరు ప్రస్తావించకపోవడం అన్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వంతో పోరాడతామన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతి ఏటా సోనియాకు కృతజ్ఞతా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement