2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారం | Sakshi
Sakshi News home page

2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారం

Published Fri, Apr 15 2016 3:05 AM

2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారం - Sakshi

మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు
 
 మంచిర్యాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని పటిష్టం చేస్తూ 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు.  పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, తిరిగి పూర్వ వైభవాన్ని సాధించేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సినిమా చూపించారని, కానీ వాస్తవానికి అవేవి అమలు చేసే పరిస్థితి  కనిపించడం లేదన్నారు.

2014 ఎన్నికల తరువాత తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి, ప్రజలకు దూరంగా ఉన్నానని, ఇకపై అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తానన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. శాంతిఖనిలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తూ, వారిలో ఒకరికి ఉద్యోగంతో పాటు, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ చుంచు ఆనందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సులేమాన్, సుంకి సత్యం పాల్గొన్నారు.

Advertisement
Advertisement