► డెరైక్టర్ ఆదేశించినా.. ఫలితం శూన్యం
► పనుల్లో జాప్యం ఆహ్లాదానికి దూరమవుతున్న స్థానికులు
రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలో పార్కు నిర్మాణం ఇంకా ‘కల’గానే మిగిలిపోయింది. ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించినా ఆచరణలో పురోగతి కరువైంది. మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్లో పార్కు నిర్మాణం చేపట్టాలని సింగరేణి యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగానే 2008లో దీనికి సంబంధించి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సదరు నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. పట్టణంలో ఉన్న ఠాగూర్ స్టేడియం ఎదురుగా ఇందుకు అనువైన స్థలం ఉన్నట్లు సూచించారు. సింగరేణి సంస్థకు చెందిన సుమారు ఐదెకరాల భూమిని పార్కు కోసం కేటాయించారు.
డెరైక్టర్ ఆదేశించినా...
‘రామకృష్ణాపూర్ పట్టణంలో పార్కు నిర్మాణం జరుగుతోంది. ఆగష్టు నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది’ అని 2015 మార్చిలో సింగరేణి డెరైక్టర్ (పాజెక్ట్ అండ్ ప్లానింగ్) అన్నారు. సాక్ష్యాత్తు సంస్థ డెరైక్టర్ మాట ఇవ్వడంతో కార్మికులు వారి కుటుంబాలు, ప్రజలు ఎంతో హర్షించారు. పట్టణంలో దాదాపు రెండు వేల మంది కార్మిక కుటుంబాలు నివసిస్తున్నాయి. కార్మికేతరుల సంఖ్య కలిపితే దాదాపు 5వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీరందరికీ పార్కు అందుబాటులో ఉంటే ఎంతో ఆహ్లాదాన్ని అందించే వీలుంటుంది. కానీ పార్కు నిర్మాణంలో కాలయాపన చోటు చేసుకుంటుండటంతో చాలా మంది అసంతృప్తికి గురవుతున్నారు.
పార్కు నిర్మాణం కోసం స్థల సేకరణ పూర్తయి కొంతమేరకు పనులు ప్రారంభించినా నిర్మాణపు పనులు పూర్తిస్థాయిలో జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధకరమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్కేపీలో పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కలగానే పార్కు నిర్మాణం
Published Sun, May 29 2016 1:59 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement