మార్గదర్శకాలు రూపొందిస్తున్న ప్రభుత్వ కమిటీ.. త్వరలో తుదిరూపు
సాక్షి, హైదరాబాద్: కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మంజూరై భర్తీకాని పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేయనుంది. వారికి ప్రభుత్వోద్యోగులకు వర్తించే అలవెన్సులు, పింఛను సౌకర్యం మాత్రం వర్తింపజేయవద్దని యోచిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ విధి విధానాలు రూపొందిస్తోంది. ఈ నెల 17న సమావేశమైన ఆ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పరిధిలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై చర్చించింది. రెగ్యులరైజ్ చేయడమంటే ‘ఉద్యోగ భద్రత’ కల్పించడమేనని తేల్చింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సీనియారిటీ పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ‘ఉద్యోగ భద్రత’ కల్పించాలని నిర్ణయించింది.
వారికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అలవెన్సులు గానీ, పింఛను సౌకర్యం గానీ ఉండవు. దాంతోపాటు రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కాకుండా... ప్రభుత్వం నుంచి మంజూరై భర్తీ కాకుండా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికే అవకాశం కల్పిస్తారు. వారు నియామక సమయంలో ప్రభుత్వ రిజర్వేషన ్లకు అనుగుణంగా రోస్టర్ పద్ధతిలో నియమితులై ఉండాలి. ఈ మేరకు రాజీవ్ శర్మ కమిటీ రూపొందించిన విధి విధానాలను అన్ని ప్రభుత్వ విభాగాలకు పంపించి అర్హులైన వారిని ఎంపిక చేయిల్సి ఉంది. ఇందుకోసం ముందుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ‘యాక్ట్ 2 ఆఫ్ 1994’ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.దీనిపై మరోసారి సమావేశమై తుది మార్గదర్శకాలను రూపొందించి, సీఎం ఆమోదం తీసుకున్న అనంతరం ఆర్డినెన్స్ ముసాయిదా రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.
ఐదేళ్లుంటేనే క్రమబద్ధీకరణ?
Published Sun, Sep 21 2014 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement